అనుమానం పెను భూతంగా మారింది. అక్రమ సంబంధాలు చక్కని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇటీవల జరుగుతున్న మరణాలన్నీ అక్రమ, ఆర్థిక సంబంధాల చుట్టూనే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఘోరం జరిగింది. భార్యను భర్త అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు.
భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ కుటుంబ కలహాలు.. పెను విషాదాలు నింపుతున్నాయి. అనుమానంతో ఒకరిని ఒకరు కించపరుచుకోవడం, దుర్భాషలాడుకోవడం, దాడి చేసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. కన్న బిడ్డల ముందే కొట్టుకు చస్తున్నారు. చిన్న చిన్న గొడవలు.. తుఫానుగా మారిపోతున్నాయి. ఇవే అఘాయిత్యాలకు కారణాలవుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న దారుణాలన్నీ అక్రమ, ఆర్థిక సంబంధాల చుట్టూ తిరిగినవే. ఇదే అనుమానం.. భర్తను కిరాతకంగా మార్చింది. భార్యను నడి రోడ్డుపై వెంటాడి చంపేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను సీఐ క్యాస్ట్రో వెల్లడించారు.
నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబిక(27) నరేందర్లు భార్య భర్తలు. సమీపంలోని శ్వాస బోటిక్ షాపులో అంబికా పనిచేస్తుంది. కొన్ని రోజుల నుండి భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. వీరికి ఓ పాప కూడా ఉంది. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నరేంద్రకు దూరంగా ఉంటోంది అంబిక. శుక్రవారం బోటిక్ షోరూమ్కు వచ్చిన అంబికపై దాడికి దిగాడు భర్త. బండరాయితో తలపై మోదాడు. అంబిక తప్పించుకుని పరిగెత్తడంతో వెంటపడి మరీ చాకుతో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అంబిక అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకునక్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కలహాల కారణంగానే భార్యను హత్య చేసినట్లు పోలీసులుచెప్పారు. అయితే కుమార్తె ఎదటే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.