రాజకీయాల్లో మహిళల అడుగులు ఇప్పుడిప్పుడే వడివడిగా పడుతున్నాయి. తాము ఎందులోనూ తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. కార్యకర్తగా ప్రయాణం చేపట్టి.. విధేయతగా పనిచేస్తూ.. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ.. పదవులు పొందుతున్నారు. పార్టీలో వీరి పాత్రకు గుర్తింపునిస్తున్న పార్టీలు.. వారికి ఉన్నత పదవులను ఇస్తున్నాయి.
రాజకీయాల్లో మహిళల అడుగులు ఇప్పుడిప్పుడే వడివడిగా పడుతున్నాయి. తాము ఎందులోనూ తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. కార్యకర్తగా ప్రయాణం చేపట్టి.. విధేయతగా పనిచేస్తూ.. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ.. అగ్ర నేతల దృష్టిలో పడుతున్నారు. పార్టీలో వీరి సేవలకు తగిన గుర్తింపునిస్తున్న అధిష్టానం.. వారికి ఉన్నత పదవులను ఇస్తున్నాయి. అయితే మహిళలు రాజకీయాల్లోకి కొంత మంది ఓర్వలేకపోతున్నారు. రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్న సమయాల్లో మహిళ నేతలపై దాడులకు ఒడిగడుతున్నారు కొందరు. తాజాగా ఓ మహిళ నేతను పొట్టనబెట్టుకున్నారు దుండగులు. అత్యంత కిరాతకంగా చంపేసి.. నడిరోడ్డుపై పడేశారు.
అసోంలో దారుణం చోటుచేసుకుంది. గోల్ పరా జిల్లాలోని 17వ నంబర్ జాతీయ రహదారిపై ఓ మహిళ మృతదేహం పడి ఉంది. గ్రామస్థులు చూడగా.. ఒంటి నిండా తీవ్ర గాయాలున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను బీజెపీ నేతగా గుర్తించారు. హుతురాలు గోల్ పరా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సోనాలి నాథ్గా గుర్తించారు. శరీరంపై తీవ్ర గాయాలుండటంతో ఆమెపై దాడి చేసి..అనంతరం హత్య చేసి నడి రోడ్డుపై పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మతియా గ్రామానికి చెందిన సోనాలి.. ఆదివారం మధ్యాహ్నం ఆమె చివరిసారిగా స్థానిక మార్కెట్లో కనిపించిందని, సాయంత్రం భర్త ఆమెకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉందని గుర్తించారు.కాగా, ఈ ఘటన దురదృష్టకరమని, పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ ట్వీట్ చేశారు. హత్యకు గల కారణాలను వెలికితీస్తామని చెప్పారు. సోనాలి నాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోనాలి నాథ్ హత్యపై అసోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలితాయ విచారం వ్యక్తం చేశారు.