Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కుమార్ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈడి సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. ఈడీ ప్రస్తుతం చికోటి ప్రవీణ్ కేసును విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. చికోటి ప్రవీణ్ దగ్గర ఓ పెద్ద అతి పురాతన పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు.
ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఆరు సంవత్సరాల క్రితం కొచ్చిన్లో 135 సంవత్సరాల నాటి పద్మనాభ విగ్రహం చూశాను. అది చెక్క విగ్రహం. 9 అడుగులు ఉంది. అలాంటి విగ్రహం ఇండియాలో ఎక్కడా లేదు. ఓ క్రిష్టియన్ దగ్గర ఉండింది. నాకు దాని గురించి తెలిసింది. నేను ఫొటోలో చూశాను. నాకు రెండు రోజులు నిద్రపట్టలేదు. నైట్ అంతా ఆయనే గుర్తుకు వచ్చాడు. వెంటనే అక్కడకు వెళ్లాను. దాన్ని చూసి అమ్మమని అడిగాను. అతను అమ్మనన్నాడు.
ఓ పెద్ద అమౌంట్ చెప్పి ఇంటికి వచ్చేశాను. తర్వాత అతనికి నిద్రపట్టలేదు. నాకు అమ్మేశాడు’’ అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ పాతదే అయినప్పటికి.. ఈడీ రైడ్ల నేపథ్యంలో సోషల్మీడియాలో వైరల్గా మారింది. చికోటి ప్రవీణ్ ఆయనకు ఎంత ఆఫర్ చేశాడన్నది క్వశ్చన్ మార్క్?.. అవతలి వ్యక్తికి నిద్ర పట్టకుండా చేసిన ఆ పెద్ద మొత్తం ఎంతన్నది ఊహలకందని విషయం. ఏది ఏమైనప్పటికి మరి, 135 ఏళ్ల నాటి అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చికోటి ప్రవీణ్ పెద్ద మొత్తం ఇచ్చి కొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చికెన్ రుచిగా వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త!