ప్రధానంగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటే భర్త టార్చర్ తట్టుకోలేక భార్య ఆత్మహత్య, అత్తింటి వరకట్న వేధింపులను బలై ఇల్లాలు బలవన్మరణం అనే టైటిల్స్ తో వచ్చిన వార్తలను మనం ఎన్నో చదివాం, విన్నాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఓ భార్య ప్రతీ రోజు భర్తను ఏదో విషయంలో టార్చర్ పెడుతూ తీవ్రంగా వేధించేది. దీనిని అవమానంగా భావించిన భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చండీగఢ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. చండీగఢ్ హిస్సార్ జిల్లాలోని ఖేరా గ్రామానికి చెందిన దిలీప్, సోనూ ఇద్దరు భార్యాభర్తలు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ రోజులు గడిచే కొద్ది భర్త అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్న భార్య భర్తను ఓ ఆట ఆడుకునేది. భార్యే కాదా అని ఇన్నాళ్లు వేచి చూసిన భర్తకు భార్య నుంచి వేధింపులు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక ఇదే విషయమై ఈ దంపతుల మధ్య అనేక సార్లు గొడవలు కూడా జరిగాయి.
అత్తమామలు కూడా భార్య సోనూకు మద్దతు ఇవ్వడంతో భార్య ఆగడాలను అడ్డుకోలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే భార్య సోనూ పుట్టింటికి వెళ్లిన కొద్ది కాలానికే భర్తతో ఉండలేక విడాకులకు దరఖాస్తు పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత కోర్టు నుంచి విడాకుల నోటీసులు కూడా భర్తకు అందింది. దీంతో మానసికంగా కృంగిపోయిన భర్త ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే భార్యతో పాటు అత్తమామలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారని, మరీ ముఖ్యంగా నా బార్య టార్చర్ తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని డెత్ నోట్ రాసుకున్నాడు. అనంతరం దానిని వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి దిలీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య సోనూతో పాటు అత్తమామలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. భార్య టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: జీవితంలో నీకు ఇక పెళ్లి కాదు! సరదాగా అన్న మాటలే!