దేశంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
దేశం వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవం లేకుండా డ్రైవింగ్ చేయడం, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణాలు అంటున్నారు అధికారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వందల కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నాయి. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రదేశాల్లో పలు అంక్షలు అమలు చేస్తున్నా.. డ్రైవర్లు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జీపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జీపై ఎన్ని అంక్షలు పెడుతున్నప్పటికీ కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం మరో చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు కేబుల్ బ్రిడ్జీపై పల్టీలు కొట్టుకుంటూ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇతర వాహనాలు డ్యామేజ్ కాగా.. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తేన. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జీపై బ్రెజా కారు పల్టీలు కొట్టింది. జూబ్లీ హిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు అతివేగంగా వెళ్తున్న బ్రెజా కారు నెం.TS09FB4896,ఒక్కసారే అదుపు తప్పి బోల్తా పడింది.
కేబుల్ బ్రిడ్జీపై కారు హైస్పీడ్ ఉండటం వల్లనే అదుపు తప్పిందని.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే కారు పల్టీలు కొట్టిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి పంపించారు. ఘటనా స్థలం నుంచి కారును తొలగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ట్రాఫిక్ ప్రవాహాన్ని క్రమబద్దీకరించేందుకు సైబరాబాద్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ పై వాహనాలు పార్కింగ్ చేయవొద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో కేబుల్ బ్రిడ్జీపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.