ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొందరు వివిధ కారణాలతో కన్నుముశారు. ఇలా ప్రముఖల మరణాలతో వారి కుటుం సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవల నందమూరి ఉమామహేశ్వరి, రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి వివిధ కారణలతో కన్నుమూశారు. తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) కన్నుమూశారు.
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి.. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా ఆనంద్ మమణి మధుమేహం వ్యాధిలో ఇబ్బందిపడుతున్నారు. క్రమంలో ఘగర్ వ్యాధి కారణంగా కాలేయం ఇన్ఫెక్షన్ కు గురైంది. దీంతో ఆయనను బెంగళూర్ లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే ఆనంద్ మమణి కోమాలోకి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆయనను తమినాడులోని చెన్నైలోకి ఓ ఆసుత్రికి తలించారు. అక్కడ చికిత్స అనంతరం తిరిగి బెంగళూరుకి తీసుకువచ్చారు. అనంతరం కొన్ని రోజుల పాటు చికిత్సపొందుతూ తాజాగా ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు.
ರಾಜ್ಯ ವಿಧಾನ ಸಭೆಯ ಮಾನ್ಯ ಉಪ ಸಭಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಆನಂದ ಮಾಮನಿ ಅವರು ನಿಧನರಾದ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನ ಮಣಿಪಾಲ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಅವರ ಪ್ರಾರ್ಥಿವ ಶರೀರದ ದರ್ಶನ ಪಡೆದು, ಕುಟುಂಬದ ಸದಸ್ಯರಿಗೆ ಸಾಂತ್ವನ ತಿಳಿಸಿದೆನು.
ಓಂ ಶಾಂತಿಃ pic.twitter.com/DMcLOzC49d
— Basavaraj S Bommai (@BSBommai) October 22, 2022
బెలగావికి చెందిన ఆనంద్ మమణి.. సవదట్టి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ తరపున రాష్ట్ర రాజకీయాల్లో చురుకగా వ్యవహరించే వారు. ఇటీవలే ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయన మృతితో బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానలు తీవ్ర విషాదంలో మునిగారు. ఆనంద్ మమణి మృతి పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్ర దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ మృతి తమ పార్టీకీ తీరని లోటని తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని , ఆయన కుటుంబానికి ఈ వార్తను భరించే శక్తి ఇవ్వాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఆనంద్ చంద్రశేఖర్ మమణికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళర్పించారు.
ನಮ್ಮ ಪಕ್ಷದ ಶಾಸಕರು, ರಾಜ್ಯ ವಿಧಾನಸಭೆಯ ಮಾನ್ಯ ಉಪ ಸಭಾಧ್ಯಕ್ಷರಾದ ಆತ್ಮೀಯ ಶ್ರೀ ಆನಂದ ಚಂದ್ರಶೇಖರ ಮಾಮನಿ ಅವರು ನಿಧನರಾದ ವಿಷಯ ತಿಳಿದು ಅತೀವ ದುಃಖವಾಗಿದೆ.
ದೇವರು ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ನೀಡಿ, ಈ ನೋವನ್ನು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಅವರ ಕುಟುಂಬ ವರ್ಗಕ್ಕೆ ಕರುಣಿಸಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. ಓಂ ಶಾಂತಿಃ pic.twitter.com/PQq96zMKPI
— Basavaraj S Bommai (@BSBommai) October 22, 2022