తన కోసం కాకపోయిన తన చుట్టు ఉన్నవాళ్ల కోసం ఏదైన చేసే మనసు ఆమెది. జీవితంపై ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. ఎప్పటికైన ఏదో సాధించాలన్న ఆశయంతో ముందు వెళ్లేది. నా కోసం కాకపోయిన.., నన్ను నమ్ముకున్నవాళ్లకోసం ఏదైన చేయాలనకుంది. చేయడమే కాదు, ఏకంగా వారి ప్రాణాలే కాపాడి చివరికి తాను లేకుండా పోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే? అతని పేరు రమణ. స్థానిక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాడు. ఇతనికి 22 ఏళ్ల కూతురు మౌనిక ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. అయితే మౌనిక ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరు పయనమైంది.
స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు రాగానే భారీ వర్షం కురుస్తుంది. వారి ముందున్న వాగు పొంగిపొర్లుతుంది. వారు ముందుకు వెళ్లాలంటే వాగుదాటాల్సిందే. ధైర్యం మాత్రం చాలడం లేదు. ఇక ఇలా అయితే కాదని భావించి ఆ కుటుంబ సభ్యులు డ్రైవర్ ను కారు కొద్దిసేపు అక్కడే ఆగమన్నారు. వర్షం తగ్గడంతో ధైర్యం చేసి కారును ముందుకు పోనిచ్చారు. వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ కారులో దాంట్లో కొట్టుకుపోతుంది. అందరు భయంతో కేకులు వేస్తున్నారు. కారులో ఉన్న మౌనిక మాత్రం అస్సలు బెదరలేదు. తన ఫోన్ తో స్థానిక వ్యక్తులకు ఫోన్ చేసి ఘటన స్థలానికి వెంటనే రమ్మని చెప్పింది. దీంతో హుటాహుటిన స్థానికులు అంతా పరుగు పరుగున వచ్చారు.
వెంటనే అలెర్ట్ అయిన మౌనిక ముందుగా తన కుటుంబ సభ్యులను కాపాడానికి స్థానికుల సాయం తీసుకుని డ్రైవర్ తో సహా అందరిని గట్టు మీదకు చేర్చింది. ఇక తాను కూడా గట్టుమీద వెళ్తానని అనుకునేలోపే నీటి ప్రవాహం పెరగడంతో మౌనిక అదే నీటిలో కొట్టుకుపోయి జల సమాధి అయింది. గాలింపు చర్యలు చేపట్టడంతోమ చివరికి మౌనిక మృతదేహాం ఉదయం దొరికింది. ఆఖరి క్షణం వరకు తనవాళ్లకోసం పరితపించి.. చివరికి మౌనిక ప్రాణాలతో లేకుండా పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.