ఈ యువతి పేరు పునీత. డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ యువతి భవిష్యత్ లో గొప్ప చదువులు చదివి జీవితంలో గొప్పగా స్థిరపడాలని కలలు కనేది. అయితే ఈ క్రమంలోనే ఆ యువతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. నేను చదువుకోవాలని చెప్పినా వినకుండా తల్లిదండ్రులు అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లారు. సాయంత్రం తండ్రి ఇంటికి వచ్చి చూడగా కూతురుని తండ్రి చూడకూడని స్థితిలో చూశాడు. ఈ సీన్ ను చూసిన తండ్రి తట్టుకోలేక కంట కన్నీరు పెట్టుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పులమతి గ్రామం. ఇక్కడే నాగప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై పునీత (19) అనే కూతురు ఉంది. ప్రస్తుతం పునీత హిందుపురంలోని ఓ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులు కూతురు పునీతకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పనీత.. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని, ఇంకా చదువుకుంటానని తెలిపింది. కూతురు మాటను లెక్కచేయని తల్లిదండ్రులు అదే పనిగా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.
అయితే కూతురు మాటను వినకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడంతో యువతి తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఇక చేసేదేం లేక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక సాయంత్రం నాగప్ప ఇంటికి వచ్చి చూడగా కూతురుని చూడకూడని స్థితిలో చూశాడు. ఈ సీన్ ను చూసి తండ్రి నాగప్ప కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇదే విషయాన్ని నాగప్ప కుటుంబ సభ్యులకు తెలియడంతో అంత శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.