సాధారణంగా మన దగ్గర ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు.. దసరా, దీపావళి సందర్భంగా బోనస్ ప్రకటిస్తాయి. అది కూడా నెలా లేదంటే.. 2,3 నెలల జీతాలు బోనస్గా ఇస్తాయి. భారీ ఎత్తున లాభాలు వస్తే.. ఓ ఆరు నెలల జీతాలు బోనస్గా ప్రకటిస్తాయి. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు వినబోయే కంపెనీ కాస్త స్పెషల్. ఎందుకంటే.. నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా కొన్ని సంవత్సరాల జీతాన్ని బోనస్గా ప్రకటించింది. దాంతో ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతకు ఉద్యోగులకు ఇలాంటి బంపరాఫర్ ఇచ్చిన కంపెనీ ఏది.. ఎక్కడ వంటి వివరాలు..
తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ కార్పోరేషన్ తన ఉద్యోగులకు ఈ భారీ బంపరాఫర్ ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 నెలల జీతాన్ని.. అంటే నాలుగు సంవత్సరాల సాలరీని బోనస్గా ప్రకటించి.. ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. ఉద్యోగి జాబ్ గ్రేడ్, తైవాన్ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుందని.. కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఇక గత రెండు సంవత్సరాలుగా.. ఎవర్గ్రీన్ సంస్థ.. భారీగా లాభాలు ఆర్జించింది. వ్యాపారం కూడా భారీ స్థాయిలో పెరిగింది. 2020తో పోల్చుకుంటే.. 2022 నాటికి దీని ఆదాయం మూడు రెట్లు అంటే.. ఏకంగా 20.7 బిలియన్ల డార్లకు పెరగనుందని కంపెనీ అంచాన వేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ బోనస్ అందరూ ఉద్యోగులకు వర్తించదట.
ఇక ఎవర్గ్రీన్ సంస్థ గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఈ కంపెనీకి చెందని నౌక ఒకటి ఈజిప్ట్లోని సూయిజ్ కాలువలో అనూహ్యంగా ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఈ భారీ నౌక.. కీలకమైన, సన్నని కృత్రిమ కాలువలో.. కొన్ని రోజుల పాటు చిక్కుకుపోవడంతో.. ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ భారీ నౌక.. ఎవర్గ్రీన్ కంపెనీకి చెందినదే కావడం విశేషం.