SBI తమ లావాదేవీల నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్తరూల్స్ ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. తమ ఖాతాదారులకు ఓ పెద్ద శుభవార్తను ప్రకటించింది. IMPS లావాదేవీల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిజిటల్ చెల్లింపుల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇంటర్నెట్, యోనో, మొబైల్ బ్యాకింగ్ ద్వారా చేసే లావాదేలకు ఈ వెసులుబాటును కల్పించింది.
IMPS, RTGS, NEFTతో సహా ఆన్ లైన్ ట్రాన్సెక్షన్స్ కు సంబంధించిన ఖాతాదారులకు వర్తిస్తుంది. కస్టమర్లను డిజిటల్ బ్యాకింగ్ వైపు ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. బ్రాంచ్ ద్వారా జరిపే లావాదేవీలకు సంబంధించిన సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్లు స్పష్టం చేసింది. కానీ, కొత్తగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొత్త స్లాబ్ ను తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదిత స్లాబ్ కు రూ.20 ఛార్జీలు ప్లస్ GSTగా నిర్ణయించారు. ఈ ఛార్జీలు కూడా ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి.