స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా అవతరించనుంది. ఈ కారణంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంటుంది. కాకినాడ ఓడరేవు, ఆయిల్ మరియు గ్యాస్ ఇండస్ట్రీ హబ్ గా ఉన్న కాకినాడకు మహర్దశ పట్టనుంది.
పౌరులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించి, మెరుగైన సామాజిక సేవలను అందించడమే లక్ష్యంగా స్మార్ట్ సిటీలను రూపొందిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా ఏపీలో నాలుగు సిటీలు డెవలప్ కానున్నాయి. ఈ నాలుగు స్మార్ట్ సిటీలు ఏపీ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సానుకూల ప్రభావం చూపనున్నాయి. స్మార్ట్ హోమ్స్ కి డిమాండ్ పెరగడం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కారణంగా ఈ సిటీల్లో రియల్ ఎస్టేట్ అనేది వేగవంతమవుతుంది. ఏపీలో స్మార్ట్ సిటీ మిషన్ లో ఎంపికైన నగరాల్లో అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ తూర్పు తీరంలో ఉన్న కాకినాడ ఓడరేవుకి, ఆయిల్ మరియు గ్యాస్ ఇండస్ట్రీ హబ్ గా మనకి తెలుసు.
వేగవంతమైన అభివృద్ధి కారణంగా సిటీలో రియల్ ఎస్టేట్ పెరిగే సామర్థ్యం కాకినాడ నగరానికి ఉంది. దృఢమైన పారిశ్రామిక పునాది, కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది పారిశ్రామికవేత్తలను, ప్రొఫెషనల్స్ ని కాకినాడ నగరం ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా నివాస స్థలాలు, వాణిజ్య స్థలాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుందని అంటున్నారు. రామారావుపేట, సర్పవరం, తూరంగి, వాకలపూడి, గాంధీ నగర్ వంటి ఏరియాలు ఉత్తమ పెట్టుబడి ప్రాంతాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రైమ్ లొకేషన్, అద్భుతమైన కనెక్టివిటీ, విలాసవంతమైన సౌకర్యాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏరియాలు పెట్టుబడి పెట్టేందుకు ఉత్తమమైన ఛాయిస్ అని చెబుతున్నారు.
పెద్దాపురం మున్సిపాలిటీ సహా పలు రియల్ ఎస్టేట్ సంస్థలు కాకినాడలోని ప్రపంచ స్థాయి ఫీచర్లు, సౌకర్యాలతో కూడిన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించేలా ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. స్మార్ట్ సిటీగా పూర్తిగా రూపాంతరం చెందిన తర్వాత కాకినాడ రూపురేఖలు మారిపోతాయి. కాబట్టి అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి కాకినాడ మంచి ఛాయిస్ అవుతుంది. రామారావుపేట, సర్పవరం, తూరంగి, వాకలపూడి, గాంధీనగర్ వంటి ఏరియాల్లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది. రామారావుపేటలో ప్రస్తుతం చదరపు అడుగు రూ. 700 నుంచి రూ. 1000 రేంజ్ లో ఉంది.
సర్పవరంలో చదరపు అడుగు స్థలం రూ. 1600 నుంచి రూ. 2,550 రేంజ్ లో ఉంది. తూరంగిలో చదరపు అడుగు స్థలం రూ. 1200 నుంచి రూ. 6,950 రేంజ్ లో ఉన్నాయి. వాకలపూడిలో చదరపు అడుగు రూ. 1200 నుంచి రూ. 4000 రేంజ్ లో ఉన్నాయి. అంటే కాకినాడలోని ఈ ఏరియాల్లో గజం రూ. 6,300 నుంచి రూ. 62,550 మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక రెండు, మూడేళ్ళలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.