కేవైసీ అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ ఏటీఎం కార్డు పనిచేయదని, బ్యాంకు ఖాతా క్లోజ్ అవుతుందని.. ఇలా ఏదో ఒక విషయం చెప్పి జనాలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ మాయగాళ్లు, ఓటీపీ వివరాలు తెలుసుకొని ఖాతాదారుల డబ్బును స్వాహా చేస్తున్నారు. ఈ మోసాల పట్ల బ్యాంకులు, ఖాతాదారులను హెచ్చరిస్తున్నప్పటికీ ప్రయోజనం ఉండట్లేదు. ఈ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారెందరో ఉన్నారు. ఈ తరుణంలో కేవైసీ అప్డేట్ కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
సైబర్ మోసాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆర్బీఐ, కేవైసీ అప్డేట్ కోసం ఇకమీదట బ్యాంకులకు వెళ్లనక్కర్లేదని తెలిపింది. ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఆన్లైన్ యాప్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి రీ-కేవైసీని పూర్తి చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణంగా ఖాతాదారులు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో కేవైసీ వివరాలు బ్యాంకులకు సమర్పిస్తారు. అయినప్పటికీ, బ్యాంకులు తరచూ ఈ వివరాలను అప్డేట్ చేయాలని ఖాతాదారులను కోరుతుంటాయి. దీన్నే రీ-కేవైసీ అంటారు. సకాలంలో కేవైసీ అప్డేట్ చేయకపోతే బ్యాంకులు.. ఖాతాదారుల లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ఉంటాయి. దీంతో ఖాతాదారులకు ఇదొక సమస్యగా మారుతోంది.
ఈ విషయం గురుంచి ఆర్బీఐ కి పిర్యాదులు వెల్లువెత్తుడంతో ఎట్టకేలకు దిగొచ్చింది. రీ-కేవైసీ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పులు లేనట్టైతే రీ-కేవైసీ కోసం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఆన్లైన్ యాప్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి రీ-కేవైసీని పూర్తి చేయవచ్చని తెలిపింది. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును సెల్ఫ్ డిక్లరేషన్కు వాడవచ్చుని పేర్కొంది. అలాగే.. కొత్తగా కేవైసీ చేసేవారికి సైతం ఊరట కల్పించింది. కేవైసీ కోసం వీలైతే బ్యాంకుకు వెళ్లొచ్చు లేదంటే వీడియోతో కూడిన కేవైసీను పూర్తి చేయవచ్చని తెలిపింది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Periodic Updation of KYC details of Customershttps://t.co/D2nB3tlhNi
— ReserveBankOfIndia (@RBI) January 5, 2023