మధ్యతరగతి ప్రజలకు వారి ఆదాయ పన్నుకు సంబంధించి భారీగా ఊరట చేకూరుస్తూ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమక్షంలో వెల్లడించారు.
డబ్బు ప్రతిఒక్కిరికి అవసరమే. ఏ పని జరగాలన్నా ముందుగా అవసరమయ్యేది డబ్బే. కాగా మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు తాము సంపాదించే ఆదాయంపై ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంవత్సర ఆదాయం ఈలోపు ఉన్నవారికి పన్నుల నుంచి ఊరట కలిగిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. పన్నుల పరంగా మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శుక్రవారం మీడియాకు వెల్లడించింది. కేంద్రం తీసుకు వచ్చిన కొత్త పన్ను విధానంతో ప్రజలకు పన్నుల నుంచి భారీగా ఉపశమనం లభించనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో రూ. 7 లక్షలు ఆదాయం పొందే వారికి పన్నుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల రూ. 7 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారి గురించి చర్చించామని, అలాంటి వారికి కూడా పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్ వెల్లడించింది. కొత్త పన్ను విధానం గురించి నిర్మలా సీతారామన్ కూలంకషంగా వివరించారు. కొత్త పన్ను విధానంలో సంవత్సర ఆదాయం రూ. 7.27 లక్షలు ఉంటే ఏవిధమైన పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. రూ. 7.27 లక్షలకు మించి ఆదాయం పొందే వారు మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.