స్థలం కొనాలని అనుకుంటున్నారా? ఇల్లు కొనాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే కోనేయండి. లేదంటే భారీగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
భూమి కొనాలనుకునేవారికి.. భూమిని నమ్ముకుని వ్యాపారం చేయాలనుకునేవారికి ఇదే సరైన అవకాశం. కొన్న కొన్ని రోజులకే భూమి ధర పెరిగితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. భూమి రేటు ఎంత త్వరగా పెరిగితే అంత సంతోషం ఉంటుంది ఎవరికైనా. మీరు ఇదే కోరుకుంటున్నట్లైతే కనుక ఇదే తగిన అవకాశం. ఎందుకో తెలుసా? భూమి ధరలు పెరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో భూముల ధరలు పెరగబోతున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏం ప్రాజెక్టులు వస్తున్నాయని ధరలు పెరగడానికి? ఏపీలో ఇప్పటికిప్పుడు ఏం అద్భుతం జరిగిందని కంపెనీలు రావడానికి అని అనుకుంటున్నారా?
భూముల ధరలు పెరగాలంటే అద్భుతాలే జరగాలా? ఎన్నికలు జరిగితే చాలదా? అవును మూడు నెలల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. ఆయా పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా వరాల జల్లులు కురిపిస్తోంది. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పై పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల తర్వాత భూముల ధరలు పెరుగుతాయని.. పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయమని అంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో నిమ్జ్ ప్రాజెక్ట్, జీవో 111 ఎత్తివేత, రీసెంట్ గా అనౌన్స్ చేసిన పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ కి మెట్రో, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో కారిడార్ వంటివి రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
ఎలక్షన్స్ అయ్యాక ఈ ఏరియాల్లో ఉన్న భూముల ధరలు పెరుగుతాయి. ఎన్నికలకు, భూముల ధరలకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏవైతే ప్రాజెక్టులు అనౌన్స్ చేసిందో.. దాని ప్రభావం ఎన్నికల తర్వాత ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది ప్రభుత్వం అనౌన్స్ చేసే ప్రాజెక్టుల మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వేరే పార్టీ అధికారంలోకి వస్తే ప్లానింగ్ మారిపోతుంది. గత ఎన్నికలప్పుడు ఏపీ విషయంలో అదే జరిగింది. తెలంగాణలో అయితే ఏ పార్టీ వచ్చినా కూడా అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు ఆగిపోయే ఛాన్స్ లేదనేది నిపుణుల వాదన. నిమ్జ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ మెట్రో, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో వంటివి కూడా లైన్ లో ఉన్నాయి. జీవో 111 పరిధిలో ఉన్న 84 గ్రామాలు ఉన్నాయి. వేరే పార్టీ వచ్చినా కూడా కాదనలేని పరిస్థితి.
ఖచ్చితంగా గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిందే. హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ ధరలు, ఇండ్ల ధరలు మళ్ళీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే.. ఇప్పటికే విశాఖలో అతిపెద్ద ఇనార్బిట్ మాల్, ఐటీ టవర్, భోగాపురం ఎయిర్ పోర్ట్, మచిలీపట్నం ఓడరేవు, ఏపీలోని ఐదు పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మారుస్తుండడం వంటివి ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపించనున్నాయి. ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. పనులు ప్రారంభమయ్యాయి. కాబట్టి తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ పనులు ఆగవు అని నిపుణుల మాట. ముఖ్యంగా ఏపీలో మళ్ళీ వైసీపీ వచ్చినా, వేరే పార్టీ వచ్చినా అభివృద్ధి పరంగా మార్పులు ఉంటాయని.. రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎన్నికల తర్వాత మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు.
గమనిక: రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.