క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్, యూపీఐ చెల్లింపులు చేసే వారికి పేటీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బిల్ పేమెంట్స్, లోన్స్ వంటి వాటి కోసం కూడా పేటీఎంని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ పేటీఎం యూజర్లకు ఇవి మంచిరోజులనే చెప్పాలి.
స్మార్ట్ ఫోన్ యూజర్లకు, నగదురహిత లావాదేవీలు చేసే వారికి పేటిఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవడం కోసం మాత్రమే కాకుండా.. బిల్స్ పే చేయడం, రెంట్ కట్టడం వంటి సేవలు కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా లోన్స్ కోసం కూడా పేటిఎంను వాడుతుంటారు. అయితే మొన్నటివరకు పేటీఎం నష్టాల్లో నడిచిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు పేటీఎం లాభాల బాట పడుతోంది. అంతేకాకుండా చాలా వేగంగా ఈ సంస్థ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. పైగా భవిష్యత్ లోనూ ఈ కంపెనీకి మంచి రోజులే ఉన్నాయంటూ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పు అటు కస్టమర్స్ కి కూడా మంచి చేస్తుందని చెబుతున్నారు.
నిజానికి పేటీఎం సంస్థ మొన్నటి వరకు నష్టాల్లోనే ఉంది. తాజాగా ఆ సంస్థ తమ నాలుగో త్రైమాసిక రిపోర్టుని విడుదల చేసింది. ఫోర్త్ క్వార్టర్ లో పేటీఎం రెవెన్యూ 51 శాతం వృద్ధిని కనబరిచి.. రూ.2,334 కోట్లకు చేరింది. ఈ గణాంకాలను చూడగానే పెట్టుబడిదారుల్లో ఆసలు రెట్టింపు అయ్యాయి. 2023వ సంవత్సరంలో పేటీఎం ఆదాయం మొత్తం 61 శాతం పెరిగి.. రూ.7,990 కోట్లకు చేరింది. ఈ కంపెనీ నష్టాలు కూడా భారీగా తగ్గిపోయాయి. గతేడాది ఇదే సమయంలో రూ.761 కోట్ల మేర అప్పులు ఉండగా.. క్యూ-3లో అవి రూ.392 కోట్లుగా ఉన్నాయి. తర్వాత క్యూ-4లో ఆ నష్టాలు రూ.168 కోట్లకు తగ్గాయి. అంతేకాకుండా పేటీఎం సంస్థ గ్రాస్ మర్చండైజ్ వాల్యూ కూడా పెరిగింది.
ఇప్పుడు ఇవన్నీ కలిపి పేటీఎం పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. అప్పుల ఊబిలోకి పోతుందని భయపడిన వారంతా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. వచ్చో త్రైమాసికానికి పేటీఎం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు ఈ లాభాలు అటు పేటీఎం పెట్టుబడిదారులకు మాత్రమే కాకుండా.. అటు కస్టమర్స్ కి కూడా శుభవార్తలను తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న ఆఫర్స్, క్యాష్ బ్యాక్, ప్రోమో కోడ్స్ అన్నీ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటున్నారు. Paytm కస్టమర్స్ కి మరిన్ని ఆఫర్స్ ఇచ్చి కంపెనీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడం, అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.