ఇప్పటికీ పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయని ఎంతో మంది.. గడువు మరోసారి పెరిగితే బాగుండి అని కోరుకున్నారు. అయితే వాళ్లు కోరుకున్న విధంగానే కేంద్రం ఆ గడువుని మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న.. పాన్ కార్డ్- ఆధార్ కార్డ్ లింక్ చేసుకునేందుకు గడువు పెంచుతారా? అయితే చాలా వరకు ఈ ప్రశ్నకు ఈసారి కష్టం అనే చెప్పుకొచ్చారు. కానీ, కేంద్రం మాత్రం ప్రజలకు ఈ విషయంలో శుభవార్త చెప్పింది. అదేంటంటే.. పాన్- ఆధార్ కార్డ్ లింక్ చేసేందుకు మరో అవకాశాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు ఉన్న డెడ్ లైన్ ని మరోసారి పొడిగించి.. ప్రజలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఎలా ఉన్నాయి? ఫైన్ ఏమైనా పెంచారా? అనే విషయాలు తెలుసుకుందాం.
పాన్ కార్డుతో ఆధార్ ని అనుసంధానం చేయాలి అనేది కేంద్రం ఎప్పటినుంచో చెబుతున్న మాట. అయితే చాలా మంది ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కరోనా సమయంలో ఈ విషయంపై కేంద్రం అంత సీరియస్ లేదు. కానీ కరోనా తగ్గిన తర్వాత రూ.500 ఫైన్ తో ఒక అవకాశాన్ని ఇచ్చింది. కానీ అప్పుడు కూడా చాలా మంది పాన్- ఆధార్ ని లింక్ చేసుకోలేదు. తర్వాత రూ.1000 జరిమానాతో మార్చి 31 వరకు అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే 51 కోట్ల పాన్ కార్డులు లింక్ అయినట్లు కేంద్రం తెలిపింది.
ఇప్పుడు చాలామంది అనుసంధానం చేసుకుందాం అనుకున్నా కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చేసుకోలేక ఉన్న వాళ్లు ఉన్నారు. అలాగే పల్లెటూర్లలో, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా ఈ అనుసంధానం ప్రక్రియ చాలా ఆలస్యం అయ్యింది. ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మరోసారి పాన్- ఆధార్ కార్డ్ లింక్ గడువుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డ్– ఆధార్ లింక్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాల్సిందిగా సూచించారు. లేని పక్షంలో జులై 1 నుంచి లింక్ కాని పాన్ కార్డులు పనిచేయవని వెల్లడించారు. జులై 1 తర్వాత మీ పాన్ కార్డ్ లింక్ కాకపోతే.. అది చెల్లనిదిగా పరిగణిస్తారు. అలా చేస్తే మీరు మీ పాన్ కార్డుని ఉపయోగించలేరు. అలాగే బ్యాంకులకు సంబంధించిన లావాదేవీల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కుంటారు. మరిన్ని వివరాల కోసం ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్ సైట్ www.incometax.gov.in ని పరిశీలించండి. పాన్ కార్డు- ఆధార్ లింక్ గడువు మరోసారి పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions.
(1/2) pic.twitter.com/EE9VEamJKh— Income Tax India (@IncomeTaxIndia) March 28, 2023