ఏ వస్తువు తీసుకున్నా, ఏదీ తిన్నా, తాగినా , చెల్లింపులు చేసే ప్రతి సారి జీఎస్టీ ఒకటి మనల్ని కలవరపాటుకు గురి చేస్తుంది. అదే వస్తు సేవల పన్ను. పాత పన్నుల పద్ధతి ప్రకారం ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నాయి. ఈ విధానానికి స్వస్థి చెప్పి
ఏ వస్తువు తీసుకున్నా, ఏదీ తిన్నా, తాగినా , చెల్లింపులు చేసే ప్రతి సారి జీఎస్టీ ఒకటి మనల్ని కలవరపాటుకు గురి చేస్తుంది. అదే వస్తు సేవల పన్ను. పాత పన్నుల పద్ధతి ప్రకారం ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నాయి. ఈ విధానానికి స్వస్థి చెప్పి దేశ మంతటా ఓకే పన్ను విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 2016లో ఓ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చి 2017లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నాలుగు శ్లాబులుగా విభజించి పన్నులను వసూలు చేస్తుంది మోడీ నేతృత్వంలోని కేంద్రం. ఆ తర్వాత శ్లాబుల్లో పలు మార్పుల చేసింది. అయితే ఇప్పుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన జీఎస్టీ 50 వ సమావేశంలో శ్లాబుల్లో మార్పులతో పాటు కొన్నింటికి పన్ను మినహాయింపు నిచ్చినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య, సంరక్షణ రంగానికి పెద్ద పీట వేస్తూ క్యాన్సర్తో పోరాడే ఔషధాలతో సహా అరుదైన వ్యాధులకు సంబంధించిన మందుల దిగుమతిలో ఐజీఎస్టీ పన్ను నుండి మినహాయించింది. ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సౌకర్యాన్ని కూడా పన్ను మినహాయింపు కిందకు తీసుకొచ్చింది. అలాగే కొన్ని వస్తువులపై శ్లాబులను తగ్గిస్తే కొన్నింటిపై పెంచింది. చిరు తిండ్లపై 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. దీంతో సినిమా థియేటర్లలో చిరు తిండ్లు రేట్లు కూడా తగ్గనున్నాయి. ఫిష్ సోలబుల్ పేస్ట్, ఎల్డీ స్లాగ్పై జీఎస్టీ రేటు ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. నూలుపై కూడా జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
అలాగే మల్లీ యుటిలిలీ వాహనాలపై 22 శాతం సెస్ విధించేందుకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, క్యాసినోలపై పెట్టుబడి పెట్టిన మొత్తం నగదుపై 28 శాతం పన్ను విధించనున్నట్లు స్పష్టం చేసింది. పాన్ మసాలా, కార్బొనైటెడ్ డ్రింక్స్, కెఫైన్ డ్రింక్స్, పొగాకు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, ఏసీలు, టైర్లు, డిష్ వాషింగ్ మెషీన్స్, స్మోకింగ్ పైప్స్ వంటివి 28 శాతం జీఎస్టీ శ్లాబులోనే కొనసాగుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్ బిజినెస్పై జీఎస్టీ భారీగా పెంచిన నేపథ్యంలో.. ఆ రంగంలోని నజారా టెక్నాలజీస్, డెల్టా కార్ప్, జన్సర్ టెక్నాలజీస్ వంటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.