బిగ్ బాస్ ఓటీటీ మొదలై.. ఇంకా వారం కూడా కాలేదు. కానీ.. అప్పుడే హౌస్ లో గొడవలకి లోటు లేకుండా పోయింది. నామినేషన్ ప్రక్రియలో నటరాజ్ మాస్టర్, ఆర్జే చైతూ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ గొడవ మరవకముందే.. హౌస్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈసారి బలి అయ్యింది మాత్రం అషు రెడ్డి. ఇంతకీ అషుకి ఎదురైన ఆ అవమానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ హౌస్ లో తొలివారం వారియర్స్ vs చాలెంజర్స్ కాన్సెప్ట్ నడుస్తోంది. అయితే.. వారియర్స్ పై ఆధిపత్యం చెలాయించే అవకాశం చాలెంజర్స్ కు లభించింది. వారియర్స్ లో ఉండే మెంబర్స్ అంతా ఆల్రెడీ బిగ్ బాస్ గేమ్ ఆడినవారే. కానీ.. చాలెంజర్స్ అందరికీ బిగ్ బాస్ కొత్త. దీంతో.. చాలెంజర్స్ కాస్త అత్యుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలెంజర్స్ టీమ్ లోని ఆర్జే చైతూ చేసిన పనికి అంతా మండి పడుతున్నారు.
చాలెంజర్స్ టీమ్ లోని చైతూ తనకి మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పడంతో.. అషురెడ్డి బాటిల్లో నీళ్లు పట్టుకొచ్చింది. కానీ.. చైతూ అషుని తనకి నీళ్లు తాగించాల్సిందిగా ఆర్డర్ వేశాడు. అప్పటికీ అషురెడ్డి టాస్క్ ని గౌరవించి చైతుకి వాటర్ తాగించింది. వాటర్ తాగిస్తున్న క్రమంలో చైతూ నోట్లో ఉన్న నీళ్లను ఉమ్మేయడంతో అవి అషూ మీద పడ్డాయి.
ఇది చూసి హౌస్మేట్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అషు అయితే.. తనకి జరిగిన అవమానానికి షాక్ అవుతూ.. అలానే నిలబడిపోయింది. కానీ.. నోట్లో నీళ్లు ఎక్కువవడం వల్ల అలా ఉమ్మానని చైతూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. చైతూ కావాలనే అలా చేశాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతటి టాస్క్ అయినా, ఏ గేమ్ అయినా.. ఇలా మహిళకి గౌరవం ఇవ్వకుండా నోటిలో నీళ్లు ఉయ్యడం ఏమిటి అంటూ.. ఆర్జే చైతుపై మండి పడుతున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.