మణిపూర్లో చోటుచేసుకున్న మారణ హోం కారణంగా ఇప్పటి వరకు 54 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు. కోట్ల ఆస్తి నష్టం సైతం జరిగింది..ముగ్గురు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి జరిగిందంటే ఏమీ చేయలేని దుస్థితి అనుకోవచ్చు. కానీ పట్టపగలే అమ్మాయిలను ఎత్తుకెళ్ళి మరీ బహిరంగప్రదేశంలో సామూహిక అత్యాచారం చేశారు.
భారత దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ప్రజలకు భద్రతను అందించే విషయంలో ఇంకా వెనకపడుతూనే ఉంది. దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో మానవత్వాన్ని మరిచిపోయి మనుషులు చేస్తున్న పైశాచికత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నో కోట్ల జనాభా, ఎంతో పెద్ద రాజ్యాంగం ఉన్న మన దేశంలో ఇలాంటి ఘోరాలు జరగడం ఎంతో విచారకరం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కొంతమంది దుండగుల బెడద అమాయకులైన ప్రజలను మృత్యు బాట పట్టిస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత వీడియో బయటకు రావడంతో మణిపూర్ కొండ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన మే 4న కంగ్పోక్పి జిల్లాలో చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ స్టేట్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న తర్వాత రోజు చోటు చేసుకుంది.
సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యామని సంబరపడాలో లేక మనిషి మానవత్వం మరిచి పైశాచికంగా ప్రవర్తిస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. ఈ ఘటన చుస్తే.. సంబరపడడం కాదు.. సిగ్గుతో తలదించుకోవాలేమో అనిపిస్తుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక గ్యాంగ్ ముగ్గురు మహిళలను వివస్త్రను చేశారు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన అల్లర్ల తర్వాత ఐదుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు. ఈ గ్యాంగ్ 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేయగా.. ఆపేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిని హతమార్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. ముందు ఈ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపి ముగ్గురు మహిళలను వివస్త్రలను చేశారు. ఆ తర్వాత 19 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అయితే మే 4న ఫిర్యాదు చేస్తే.. జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరస్తులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక గ్యాంగ్ ముగ్గురు మహిళలను వివస్త్రను చేశారు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన అల్లర్ల తర్వాత ఐదుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు. ఈ గ్యాంగ్ 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేయగా.. ఆపేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిని హతమార్చింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. ముందు ఈ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపి ముగ్గురు మహిళలను వివస్త్రలను చేశారు. ఆ తర్వాత 19 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అయితే మే 4న ఫిర్యాదు చేస్తే.. జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరస్తులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.