జమ్మూ కాశ్మీర్ లో ఒక మహిళ ఒకరిద్దరిని కాదు ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
సాధారణంగా భారత దేశంలో రెండు వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఇలా చేయాలంటే పరస్పర అంగీకారంతో కోర్ట్ ల చుట్టూ తిరిగి అధికారికంగా విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడం కోసం తిప్పలు పడాలి. దేశంలో ఒక్కరితో విడిపోయి మరొకరితో వివాహం చేసుకోవాలంటేనే ఇంత కష్టంగా మారిన తరుణంలో ఒక మహిళ ఏకంగా 27 మందిని వివాహం చేసుకుంది. వినడానికి కాస్త వింతగా మరికాస్త విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. అయితే భారత్ దేశం చట్టం దానికి వ్యతిరేకం కదా ఇది ఎలా సాధ్యమైంది అనే అనుమానం మీలో రావొచ్చు. అయితే అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
జమ్మూ కాశ్మీర్ లో ఒక మహిళ ఒకరిద్దరిని కాదు ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అంతమందిని పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తయితే వారందరినీ మోసం చేసి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మహిళ ఒకరిని పెళ్లి చేసుకొని వారి దగ్గర 20 రోజులు ఉండేది. ఉన్నరోజుల్లో వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం తీసుకొని ఉడాయించేది. ఒకరోజు ఈమెను పెళ్లిచేసుకున్నవారు ఒక 12 మంది తమ భార్య కనిపించడం లేదని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమె ఫోటో చూపించి ఫిర్యాదు చేసారు. అయితే ఫిర్యాదు చేసినవారు తమ భార్య ఫోటో చూపించగానే అందరి దగ్గర ఆ మాయ లేడీ ఫోటోనే ఉండడం విశేషం. ఇది తెలిసి పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇదేదో నెట్ ఫ్లిక్ షో లాగే ఉందని ట్వీట్ చేసాడు. మరి ఒక్క మహిళా 27 మందిని మోసం చేయడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Rajouri ‘Runaway bride’ allegedly married twenty seven (27) men in Budgam district only.
Reports Ubaid Mukhtar~ TK pic.twitter.com/nbhRLObs2k
— The Kashmiriyat (@TheKashmiriyat) July 13, 2023