బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను పక్కా ఎంటర్ టైన్ చేస్తోందని చెబుతున్నారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ ను ప్రేక్షకులే కాదు.. ఇంట్లోని సభ్యులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్సీ పోటీదారుల టాస్కు, కెప్టెన్సీ టాస్కు, పనులు చేయడానికి టాస్కు, చేయకుండా ఉండడానికి టాస్కు ఇలా ప్రతి విషయంలో టాస్కులు ఉండటంతో గ్రూపులుగా బాగా కొట్టేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ముమైత్, శ్రీ రాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ మొదలైన దగ్గర నుంచి ఆ బజ్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓటీటీ కాన్సెప్ట్ పై బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ కౌశల్ స్పందించాడు.
ఇదీ చదవండి: కోటి రూపాయల కారు! స్టార్ హోటల్ లాంటి ఇల్లు! ఎవరీ మిత్రా శర్మ?
స్పందించడమే కాదు.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్ విన్నర్ ఎవరు అవుతారో అనే విషయాన్ని కూడా చెప్పేశాడు. ఇంట్లో ఉన్నవారిలో టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం బిందు మాధవికి ఉందని కౌశల్ అభిప్రాయ పడ్డాడు. ఆమె ఆటిట్యూడ్, గేమ్ స్టైల్ మొత్తం విన్నర్ అయ్యేందుకు ఎక్కువ దోహదం చేస్తాని తెలిపాడు. ఇంక రెండోసారి ఇంట్లోకి ఎంటర్ అయిన్ వారి గురించి కూడా కౌశల్ ప్రస్తావించాడు. వాళ్లు రెండోసారి ఎందుకు ఇంట్లోకి వచ్చారో అర్థంకాలేదని.. ఇంకా వాళ్లకి బిగ్ బాస్ గేమ్ అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు.
కౌశల్ అన్న మాటలు నిజం అనే భావనకు ఎంతోమంది ప్రేక్షకులు వస్తున్నారు. ఎందుకంటే బిందు మాధవి గేమ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంది. ఫ్రెండ్స్ కు సపోర్ట్ చేయడం. గ్రూప్ ప్లేయర్ గా ఉండటం. తను అనుకున్నది నేరుగా చెప్పడం. తన తప్పు లేకుండా ఎవరైనా వేలు చూపిస్తే వారికి సమాధానం చెప్పడం. ఇలాంటి ఎన్నో క్వాలిటీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పైగా తెలుగు అమ్మాయి కావడం కూడా ఆమెకు బాగా కలిసొచ్చే అంశం. ఇంట్లో ఎంతో పద్ధతిగా ఉండటం కూడా ఆమెను ఇష్టపడేలా చేస్తున్న అంశమే. కౌశల్ గెస్ కరెక్ట్ అయితే బిందు మాధవి విన్నర్ కావడం ఖాయం. బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విన్నర్ కాగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.