బిగ్ బాస్ ఐదో సీజన్ లో యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం వల్ల ఫైనల్ వరకు వచ్చేశాడు. విజేత మాత్రం కాలేకపోయాడు. గతేడాది.. షన్నుకి అభిమానులు ఓట్స్ విషయంలో ప్రతి వారం కూడా సేవ్ చేశారు. అక్కడితో ఆ సీజన్ అయిపోయింది. షన్ను ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆరో సీజన్ కోసం షన్ను ఫ్యాన్స్ అందరూ ఒక్కటైనట్లు కనిపిస్తోంది. మళ్లీ వీళ్లు ఎందుకు యాక్టివ్ అయ్యారని మీకు కచ్చితంగా డౌట్ వచ్చుంటుంది కదా! ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లోపల-బయట ఏం జరుగుతోంది?
ఇక ప్రస్తుత సీజన్ విషయానికొస్తే.. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌసులోకి అడుగుపెట్టారు. ఇందులో 11 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు. వీళ్లందరిలోనూ తొలి రెండు మూడు రోజుల్లోనే అటెన్షన్ గ్రాబ్ చేసిన పర్సన్ గీతూ. చిత్తూరు యాసతో గలాగలా మాట్లాడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు మరీ చిన్నచిన్న విషయాలకే ఆమె గొడవలు పడటం మాత్రం వ్యూయర్స్ కి కాస్త చిరాకు తెప్పించింది. ముఖ్యంగా ఇనయాతో పదేపదే వాగ్వాదానికి దిగడం అయితే చర్చనీయాంశమైంది.
బిగ్ బాస్ హౌస్ కి రాకముందు.. అంతకు ముందు సీజన్లలో గీతూ ఈ షోతో పాటు అందులోని కంటెస్టెంట్స్ గురించి రివ్యూ చెప్పేది. అలా గత సీజన్ లో షణ్ముఖ్ గురించి ఒకానొక సందర్భంలో కాస్తగా డిఫరెంట్ గా మాట్లాడింది. దీంతో షన్ను ఫ్యాన్స్ హర్టయ్యారు. అప్పట్లోనే ఈమెపై కాస్త వ్యతిరేకత చూపించారు. ఇప్పుడు ఏకంగా ఆమెనే హౌస్ లో ఉండేసరికి టార్గెట్ చేయాలనుకున్నారు. కానీ మొదటివారం క్లాస్ కేటగిరీలోకి వెళ్లిపోయి, ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. దీంతో గీతూ ఇబ్బందిపెడుతున్న ఇనయాని సేవ్ చేయాలని షన్ను ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తద్వారా గీతూకి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జశ్వంత్.. అసలు ఏం జరిగిందంటే?