బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అనుకున్న ఆదరణ రాలేదని షో నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునానే చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. అయితే ఈ సీజన్లో మీకు ఫుడ్ పెట్టడం కూడా దండగే అని ముఖంమీదే చెప్పేసి.. గేట్ ఓపెన్ చేసి ఇక దయచేయండి అంటూ చెప్పడం చూశాం. నాగార్జున కూడా మీరు గేమ్ ఆడటానికి వచ్చినట్లు లేదు.. ఏదో వెకేషన్కి వచ్చినట్లు ఉన్నారు అంటూ చురకలు అంటించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత నుంచి హౌస్లో కాస్త కొట్టుకోవడం, గేమ్ ఆడటం, ఫిజికల్ టాస్కులు తీసుకోవడం చేశారు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ విన్నర్ అయినా కూడా పెద్దగా ఒరిగేదీ ఏమీ లేదని తెలుస్తోంది. బిగ్ బాస్ ఇప్పటికే ప్రైజ్ మనీ కోతలు మొదలు పెట్టాడు కూడా.
ప్రస్తుతం హౌస్లోని నామినేటెడ్ సభ్యులకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే నామినేషన్లో ఉన్న సభ్యులకు చెక్కులు ఇచ్చి మీకు నచ్చిన అమౌంట్ రాయండి. ఎవరు అయితే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్లు సేవ్ అవుతారు అని చెప్పింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వాళ్లు కోట్ చేసిన అమౌంట్ని బిగ్ బాస్ ప్రైజ్మనీ రూ.50 లక్షల నుంచి తగ్గిస్తారు. అలా ఇచ్చిన గేమ్లో రాజ్ 4,95,700 కోట్ చేశాడు. ఆ మొత్తాన్ని ప్రైజ్మనీని రూ.45,00,300కి తగ్గించారు. అక్కడికే హౌస్మేట్స్ ఏడుస్తుంటే.. బిగ్ బాస్ ఇంకో బండవేశాడు. మీకు సమయానుసారంగా కొన్ని టాస్కులు వస్తాయి. ఆ టాస్కుల్లో విజయం సాధిస్తే ప్రైజ్మనీ తగ్గకుండా ఉంటుంది అంటూ చావు కబురు చల్లగా చెప్పారు.
మొదటి టాస్కుగా 7 నిమిషాల 30 సెక్లలో 100 పరుగులు చేయాలంటూ ఒక టాస్కుఇచ్చారు. అది కూడా రియల్ బ్యాట్స్మన్ లాగా ప్యాడ్లు, థయిస్ ప్యాడ్, ఆర్మ్ ప్యాడ్ అన్నీ కట్టుకుని పరుగులు చేయాలి. ఈ టాస్కులో రోహిత్- రేవంత్ రన్నర్లు పాల్గొన్నారు. నిర్ణీత సమయంలో 82 పరుగులు చేయగలిగారు. చివరికి ఆయాసంతో కుప్పకూలారు. కానీ, వాళ్ల పోరాట పటిమ ఎంతో బాగుంది. చివరికి వారికి పరాజయం మాత్రం తప్పలేదు. అలా మరిన్ని టాస్కులతో ఈ ప్రైజ్మనీని మరింత తగ్గించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంటే 7.30 నిమిషాలలో ప్రొఫెషనల్ క్రికెటర్లు కూడా 100 పరుగులు చేయలేరు. అంటే వాళ్లు చేయకూడదు అనే బిగ్ బాస్ ఆ టాస్కు ఇచ్చినట్లు అనిపిస్తోంది. అలా సాధ్యమైన మేరకు ప్రైజ్మనీని కోస్తారని చెబుతున్నారు.
ఒకవేళ ఈ కోతలు ఇక్కడితో ఆపేసినా కూడా.. గత సీజన్లను బట్టి చూస్తే విన్నర్కు మిగిలేదీ ఏమీ పెద్దగా కనిపించడం లేదు. నిజానికి బిగ్ బాస్ ప్రైజ్మనీ రూ.50 లక్షలు అని అందరికీ తెలిసిందే. ఇలాంటి రియాలిటీ షోలలో గెలిచిన మొత్తంపై చాలా వరకు ట్యాక్స్ కట్ అవుతుంది. ముందు ట్యాక్స్ కట్ చేసిన తర్వాతే విన్నర్కు ప్రైజ్మనీ అందజేస్తారు. రూ.50 లక్షల ప్రైజ్మనీలో 14 లక్షలు కట్ చేస్తారని చెబుతుంటారు. అంటే ముందుగా కట్ చేసిన 4,99,700 + రూ.14 లక్షలు కూడా కట్ అవుతాయి. ఇంక వెనకటి సీజన్లు చూస్తే.. టాప్ 3 సభ్యులు డిసైడ్ అయిన తర్వాత ఒక సెలబ్రిటీకి ఇచ్చి సూట్కేస్లు పంపుతారు. అందులో ముందుగా రూ.10 లక్షలు, తర్వాత 25 లక్షల వరకు అమౌంట్ని పంపుతారు. ఆ సూట్ కేసు కావాలనుకుంటే ఆ మొత్తం తీసుకుని బయటకు వచ్చేయచ్చు.
అలా సోహెల్ రూ.25 లక్షల సూట్కేస్ తీసుకుని బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు గెలిచిన అభిజిత్కి- సోహెల్ సేమ్ ప్రైజ్మనీ దక్కింది. పేరుకు అభిజిత్ విన్నర్- సోహెల్ టాప్3.. కానీ అమౌంట్ విషయంలో ఇద్దరికీ సేమ్. ఇప్పుడు అలా రూ.25 లక్షలు పంపితే ఇంక అంతే సంగతులు. టాప్ 3లో ఎవరు ఉన్నా కూడా ఆ సూట్కేస్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రైజ్మనీ కంటే ఆ మొత్తమే ఎక్కువని వాళ్లకి బాగా తెలుసు. అంటే రూ.50 లక్షల నుంచి.. రూ.4,99,700- రూ.లక్ష- రూ.25 లక్షలు- రూ.14 లక్షలు ట్యాక్స్= రూ.5,00,300 మాత్రమే మిగులుతుంది. అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ అయినా మిగిలేది ఏమీ లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా గత సీజన్ల మాదిరిగా జరిగితేనే సాధ్యమవుతుంది. మరి.. బిగ్ బాస్ ప్లాన్ ఏంటో చూడాలి.