అక్కినేని నాగార్జున పుట్టిన రోజున అభిమానుల కోసం మన్మధుడు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
ఆగస్టు 29 యువసామ్రాట్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఆ రోజున నాగార్జున తన అభిమానుల కోసం మన్మధుడు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నాడు. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎపుడెపుడు ఆగష్టు 29 వస్తుందా.. తమ అభిమాన కథానాయకుడికి బర్త్ డే విషెస్ చెప్పి ఎప్పుడెప్పుడు మన్మధుడు సినిమా చూద్దామా అనే అతృతతో ఉన్నారు. పైగా తన బర్త్ డే రోజున ఇంకా అభిమానుల ఆనందాన్నిపెంచేలా నాగార్జున ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, ప్రభాస్ ల తో సై అనేలా ప్లాన్ చేస్తున్నాడు.
నాగార్జున అంటే ఆయన అభిమానులకి ఎంతో ప్రాణం. నాగార్జున చేసే సినిమాలన్నీ చాలా డిఫరెంటుగా ఉంటాయి. ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదు. లవ్, యాక్షన్, ఫ్యామిలీ, భక్తి.. ఇలా అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేసి తన అభిమానులతో పాటు సినీ అభిమానుల్ని కూడా మెప్పించడంలో నాగార్జున ముందు వరసలో ఉంటాడు. అలాగే ఆయన తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. ఇప్పుడు తాజాగా ఆయన తన పుట్టిన రోజైన ఆగస్టు 29 న ఒక కొత్త సినిమా ని ప్రకటించబోతున్నాడు. ఆ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు.
విజయ్ బిన్నీఈ మధ్యన వచ్చిన ఎన్నో సినిమాలకి నృత్య దర్శకుడిగా పనిచేసాడు .నాగార్జున పుట్టిన రోజున మూవీ ఓపెనింగ్ అవ్వబోతుంది. ఆ రోజే విజయ్ బిన్నీతో చేయబోయే సినిమాని అనౌన్స్ చేయడంతో పాటు సినిమా టైటిల్ ని కూడా ప్రకటిస్తారు. నా సామి రంగ.. అనే ఒక సూపర్ టైటిల్ ని పెట్టబోతున్నారు. అలాగే ఫాన్స్ కి ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే 29 నే మూవీ ప్రకటన అండ్ టైటిల్ తో పాటు మూవీ ప్రోమో అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చెయ్యబోతున్నారు.
నాగార్జున, విజయ్ బిన్నీల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొని సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. సంక్రాంతికి ఆల్రెడీ మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఈసారి కూడా సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారుతుందని అనడంలో సందేహం లేదు. కాగా నాగార్జున కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాలే ఉదాహరణలు.