బిగ్ బాస్ షో అంటేనే ఎవరికి వారు పర్సనల్ గా ఆడాలి. హౌజులోకి వచ్చిన తర్వాత ఎన్ని రిలేషన్స్ మెంటైన్ చేసినా సరే గేమ్ విషయానికొచ్చేసరికి మాత్రం ఒంటిరిగానే పోరాడాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం వచ్చేస్తుంది. మరోవైపు బిగ్ బాస్ అంటేనే గ్రూపులు కూడా కచ్చితంగా ఉంటాయి. తమకు సింక్ అయిన వారితో పలువురు కంటెస్టెంట్స్.. బాండింగ్ మెంటైన్ చేస్తుంటారు. కానీ వాళ్ల అసలు రంగు బయటపడితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ లో అప్పుడే 60 రోజులు గడిచిపోయాయి. అయినా పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. రేవంత్, గీతూ లాంటి వాళ్లు తప్పించి మిగిలిన వాళ్లందరూ సోసోగా ఆడుతున్నారు. ఇక గీతూ విషయానికొస్తే తన స్వభావం ఏంటో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెబుతూనే ఉంది. ఆట విషయానికొస్తే తనకు ఎవరైనా ఒకటేనని, అవసరం అనుకుంటే మా అమ్మనాన్నల్ని అయినా ఓడించడానికి అస్సలు మొహమాటపడనని.. తనంత నీచమైన, దరిద్రమైన, క్యారెక్టర్ లేని దాన్నని పబ్లిక్ గానే గీతూ ఒప్పేసుకుంది. ఈమె విషయంలో హౌస్ మేట్స్ అందరూ గట్టిగానే ఎఫెక్ట్ అయ్యారు. ఒక్క ఆదిరెడ్డి తప్ప.
బిగ్ బాస్ రివ్యూలు చేసి గీతూ, ఆదిరెడ్డి ఈ సీజన్ లో పార్టిసిపెంట్స్ గా వచ్చారు. స్వతహాగా రివ్యూయర్స్ కావడం వల్ల వీరిద్దరూ ఎప్పడూ కలిసి ఉండేవారు. ఆదిరెడ్డి గేమ్ పరంగా మంచిగానే ఆడుతున్నప్పటికీ.. గీతూ వెనకే ఎప్పుడూ తిరుగుతూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో గీతూ చేయాల్సిన బాత్రూంలు కడగడం, కాఫీ కప్పులు ఎత్తడం కూడా మనోడే చేశాడు. అయితే గేమ్ కోసం ఎంతకైనా తెగిస్తానని గీతూ ముందే చెప్పింది. ఇప్పుడు ‘మిషన్ పాజిబుల్’ టాస్కులో భాగంగా గీతూ, ఆదిరెడ్డి చెరో గ్రూప్ లో ఉన్నారు. ఇందులో భాగంగా గేమ్ ఆగిన తర్వాత ఆది టీషర్ట్ కి ఉన్న స్ట్రిప్స్ ని గీతూ దొంగిలించింది.
ఈసారి కెప్టెన్సీ టాస్క్ విషయంలో బుద్ధి లేకుండా ప్రవర్తించిన గీతూ.. బుద్ధిబలం ఉపయోగించా అని ఆదిరెడ్డితోనే గొడవ పెట్టుకుంది. దీంతో ఒక్కసారిగా షాకైన అతడు.. గీతూ చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు. టీషర్ట్ తీసి నేలకేసి కొట్టాడు. తుప్పాస్ గేమ్ ఆడావ్ అని డైరెక్ట్ గానే ఆమె తిట్టాడు. గేమ్ తర్వాత గీతూ, ఆదిరెడ్డికి అదే చెప్పింది. దీంతో ఆదిరెడ్డి.. ‘నువ్వు త్వరలోనే బాధపడతావ్.. రెండు కళ్లలో నుంచి నీళ్లు కూడా వస్తాయి చూడు. ఆ రోజు తెలుస్తుంది. నీకు నేను కొట్టిన దెబ్బ’ అని గీతూకి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.