‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్లో ఆట రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే 50 రోజులు పూర్తయ్యాయి. తాజాగా ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్ నుంచి ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అంటూ డౌట్ డౌట్గా గడుపుతున్నారు. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. కొందరి గేమ్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అవుతున్న సందర్భాలు కూడా చూశాం. ప్రియ ఎలిమినేట్ అవుతూ షణ్ముఖ్ను పెద్ద ఇరకాటంలోనే పెట్టింది. పాపం షణ్ముఖ్ దీప్తీ సునైనా పేరు ఎత్తగానే గడగడ వణికిపోయాడు. నాగార్జున కూడా కాసేపు షణ్నుతో ఆడుకున్నాడు.
ప్రియ స్టేజ్పై మాట్లాడుతూ షణ్ముఖ్ గురించి ప్రస్తావిచింది. ‘షణ్ను.. దీప్తీకి ఏమైనా చెప్పమంటావా? అయినా నువ్వు ఆమెను ఈ మధ్య పెద్దగా ఏం మిస్ కావట్లేదులే. ఎప్పుడో ఒకసారి అక్కడక్కడ రాస్తూ కనిపిస్తున్నావు అంతే’ అనగానే షణ్ముఖ్ ‘ప్రియగారు ఏం వద్దండి. ఇది చూడగానే తనకి అర్థమైపోతుంది. వామ్మో నన్ను బుక్ చేయకండి’ అంటూ బతిమాలుకున్నాడు. మధ్యలో నాగార్జున కూడా ‘ఏంటి షణ్ముఖ్ నీకు అంత భయమా? అమ్మోరు అంటున్నావు’ అనగానే బిక్కమొహం వేశాడు.
ఇదీ చదవండి: ప్రియ ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందా? తప్పు ఎవరిది?
షణ్ముఖ్కు వాళ్ల తల్లిదండ్రుల కంటే దీప్తీ సునైనా అంటేనే భయమంటా. ‘మా ఇంట్లో వాళ్లకి కూడా భయపడను కానీ, దీప్తీ అనగానే భయమేస్తుంది’ అని షణ్ను ఓపెన్ అయి పోయాడు. ఇంక అతడిని ఇరికించడం దేనికిలే అని అక్కడితో వదిలేశారు. ప్రియ మార్కులు వేస్తూ షణ్ముఖ్కు 8 ½ మార్కులు ఇచ్చింది. చాలా బాగా ఆడుతున్నాడు. మీ ముగ్గురు అలాగే కలిసుండండి అంటూ ప్రియ కోరుకుంది.