‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి ప్రియంక సింగ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెండర్లలో తను కూడా ఒకరు. ఆమె 13 వారాలు హౌస్ లో కొనసాగిందంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె హౌస్ లోకి వెళ్లే సమయంలో మహా అయితే ఒక మూడు వారాలు ఉంటుంది అనుకున్నారు. కానీ, ఆ మూడు కాస్తా పదమూడు అయ్యింది. అంతేకాదు అసలు బిగ్ బాస్ నుంచి ప్రియాంకకు ఎంత పారితోషకం అందింది అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ప్రియాంక దాదాపు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిలో ఉంది. ఆ విషయం ఆమె నోటితోనే మనం చాలాసార్లు విన్నాం. అయితే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఆమెకు అందింది ఎంతో చూద్దాం.
చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియాంక సింగ్ కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రియాంక ఇప్పుడు లక్షాధికారి అయ్యింది. 13 వారాలు హౌస్ లో ఉండి అందరితో శభాష్ అనిపించుకుంది. ఒక్కో వారానికి రూ.1.7 లక్షల దాకా అందినట్లు తెలుస్తోంది. అంటే ప్రియాకంకు దాదాపు రూ.23 లక్షల వరకు అందుంటాయి. ప్రస్తుతం ప్రియాంక సింగ్ కెరీర్ ను బిల్డ్ చేసుకోవడానికి ఆ డబ్బు ఎంతో ఉపయోగపడతాయి. జబర్దస్త్ ద్వారా ప్రియాంకకు వచ్చిన ఫ్యాన్ బేస్ కన్నా కూడా బిగ్ బాస్ తో వచ్చిన ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా ప్రియాంక లైఫ్ సెట్ అయిపోయినట్లే.
బిగ్ బాస్ ద్వారా ప్రియాంక సింగ్ చిరకాల కోరిక కూడా తీరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రియాంక సర్జరీ ద్వారా అమ్మాయిగా మారింది. కానీ, అందరిలాగా తల్లి కాలేదు. ఆమె గతంలోనూ ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ, అందుకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని కోరడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేసింది. బిగ్ బాస్ ద్వారా అందిన రెమ్యూనరేషన్ తో పింకీ తన కల నెరవేర్చుకుంటుందనే అందరూ భావిస్తున్నారు. బిగ్ బాస్ ద్వారా ప్రియాంక కల నెరవేరనుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.