వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఈ ఘటన జాతీయ స్థాయిలోనూ చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో కొందరు టీడీపీ, జనసేన నాయకులు.. తన ఫోటోని మార్ఫింగ్ చేసి.. తనపై దుష్ప్రచారం చేసి.. వేధిస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. తాను నాలుగేళ్లుగా వైసీపీ సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని.. అప్పటినుంచి టీడీపీకి నాయకులు కొందరు తనను టార్గెట్ చేశారని అనితా రెడ్డి ఆరోపించారు.
టీడీపీ నేతలు తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని.. ఇప్పుడు మరీ నీచంగా ఎంపీ మాధవ్ పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేసి.. తనను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇదంతా టీడీపీ కుట్ర అని.. ఆ పార్టీ కార్యాలయం నుంచే ఇదంతా జరుగుతోందని అనితా రెడ్డి తెలిపారు. ఇదంతా లోకేష్ డైరెక్షన్లోనే కుట్ర జరిగిందని.. మహిళలను ఇంతలా వేధించడం చంద్రబాబుకే చెల్లుతుందని అనితా రెడ్డి ఆరోపించారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా రెండేళ్లుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఈ సందర్భంగా అనితా రెడ్డి ఆరోపించారు. తన భర్త ఫొటోను మార్ఫింగ్ చేసినా.. వ్యక్తిగతంగా దూషించినా భరించానని.. ఇప్పుడు ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో ఆయన పక్కన, తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువును బజారుకీడుస్తున్నారని మండి పడ్డారు. కొంతమంది జనసేన పార్టీ వారు కూడా ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. కరీమ్, వేణు, చందు, నవీన్కుమార్, రమణ అనే ఐదుగురు తనను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించినట్లు అనితా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని అనితా రెడ్డి కోరారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.