తెలంగాణ సీఎస్గా, జీహెచ్ఎంసీ కమిషనర్గా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రతినిత్యం ఏదో ఒక వార్తల్లో నిలిచేవారు. ఇటీవల ఆయన ఏపీ క్యాడర్ కి చెందిన అధికారి గా తెలంగాణ హైకోర్టు తెలిపింది.
తెలంగాణలో సుదీర్ఘమైన సేవలు అందించిన మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. సోమేశ్ కుమార్ ని ఇటీవల ఏపీ క్యాడర్ కి చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయగా గత నెల 12 న ఏపీ కెడర్ లోకి సోమేశ్ కుమార్ రిపోర్ట్ చేశారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన రిపోర్ట్ ఇచ్చిన నేల రోజులు అవుతున్నా పోస్ట్ మాత్రం కేటాయించలేదు. ఈ క్రమంలోనే ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
గతంలో తెలంగాణ సీఎస్గా, జీహెచ్ఎంసీ కమిషనర్గా కీలక బాధ్యతలు నిర్వహించి ప్రభుత్వంచే షభాష్ అనిపించుకున్నారు. ఇటీవల ఆయన ఏపీ క్యాడర్ కి చెందిన అధికారి గా తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయనను ఏపీకి వెళ్లాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక సోమేష్ కుమార్ ని సీఎస్ బాధ్యతల నుంచి తొలగిస్తు ఆయన స్థానంలో రత్నకుమారి అనే ఐఏఎస్ అధికారిణికి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏపీకి బదిలీ అయిన సోమేష్ కుమార్ జనవరి 12న ఏపీ క్యాడర్ కి రిపోర్ట్ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో సోమేష్ కుమార్ ఇక్కడ నుంచి రిలీవ్ అయి ఏపి కేడర్ కి రిపోర్ట్ చేసినప్పటికీ ఆయనకు తగిన పోస్ట్ విషయంలో తర్జనభర్జన జరిగింది. అదే సమయంలో ఆయనకు పోస్టింగ్ విషయం కూడా ఆలస్యం అయ్యింది. అయితే సోమేష్ కుమార్ కి ఏ పదవి కట్టబెడతారో అని తెలుగు రాష్ట్రాల అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే తనకు ఏ పోస్ట్ ఇచ్చినా స్వీకరిస్తానని సోమేష్ స్పష్టం చేసినట్లు సమాచారం. కానీ.. ఇప్పుడు ఆయన స్వచ్ఛందంగా వీఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకోవడం.. అందుకు సీఎం జగన్ అంగీకరించడం వెంట వెంటనే జరిగిపోయింది. ప్రస్తుతం సోమేష్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల అధికా వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.