భారీ వర్షాలు వస్తే గ్రామాలు, నగరాల్లో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతుంటారు. రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో ఎక్కడ గోతులు ఉంటయో తెలియదు.. కొన్ని చోట్ల నాలాలు మృత్యు కుహరాలుగా మారుతుంటాయి.
హైదరాబాద్ వాసులు నిన్నటి వరకు వీధి కుక్కల దాడితో బెంబెలెత్తితే.. ఇక తాజాగా వర్షాకాలం ప్రారంభం కాకముందే మ్యాన్హోల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నేడు మ్యాన్హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. నగర మేయర్ విజయలక్ష్మి బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ వివారలు..
కళాసిగూడ ప్రాంతంలో నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పదేళ్ల చిన్నారి ఘటనలో జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇందుకు ఇద్దరు అధికారులను భాద్యులను చేస్తూ వారిపై వేటు వేసింది.
వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న మహీంద్ర కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉచిత ట్రైనింగ్తో పాటు.. ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అదీ కాకుండా మరో వారం రోజుల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పిల్లలను కట్టడి చేయడం తల్లిదండ్రులకు తలకు మించిన పనే. అలా వారిని కట్టడి చేయాలంటే అందుకున్న ఏకైక మార్గం సమ్మర్ క్యాంపులు.
సాధారణంగా బీజీ లైఫ్ గడిపేవాళ్లు.. ఉద్యోగులు ఇంట్లో వంట చేసుకునే సమయం లేకపోవడంతో ఫుడ్ కోసం ఆన్ లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. తాము ఎంతో ఇష్టపడే ఫుడ్ వచ్చింది.. తృప్తిగా తినాలీ అనుకునే లోపు వాటిలో పురుగులు, బొద్దింయలు, ఇతర చిన్న వస్తువులు కనిపించడంతో ఖంగు తింటున్నారు. ఇటాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్లాస్టీక్ ని ఏదో ఒక రకంగా వాడుతూనే ఉన్నాం. ప్లాస్టీక్ సంచుల వల్ల పర్యావరణానికి ఎంత ముప్పు ఉందని తెలిసినా కూడా దాని వాడకం మాత్రం తగ్గించలేకపోతున్నాం. ప్రభుత్వం ప్లాస్టీక్ నిషాదాన్ని అమలు చేస్తున్నా.. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్, కూరగాయల మార్కెట్లో ప్లాస్టీక్ సంచులు లేనిదే గడవని పరిస్తితి.
హైదరాబాద్ నగర వాసులకు సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు, కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నగర వాసులకు ఇప్పటికీ వెంటాడుతున్న సమస్యల్లో ట్రాఫిక్ అనేది ప్రధానంగా ఉంటుంది. అందుకే ఈ ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూనే ఉంది.
అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నల కడుపునింపే దిశగా అడుగులు వేస్తోంది. పంట అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు వచ్చే రైతన్నలకు రూ. 5కే రుచికరమైన భోజనం అందించాలని యోచిస్తోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.