ఆ కుటుంబ పెద్ద.. చాలా ఏళ్ల క్రితం అనారోగ్య కారణంతో మరణించాడు. దీంతో ఇద్దరు ఆడపిల్లలను, ఒక కుమారుడి పోషణ బాధ్యతలు ఆ ఇంటి ఇల్లాలిపై పడ్డాయి. అలా కష్టాలను ఎదుర్కొంటు పిల్లలను ఓ స్థాయికి తీసుకొచ్చింది ఆ తల్లి. అంతాబాగుంది అనుకున్న సమయంలో విధి కన్నెర్ర చేసి.. ఆ కుటుంబంలో విషాదం నింపింది.
ఆ కుటుంబ పెద్ద.. చాలా ఏళ్ల క్రితం అనారోగ్య కారణంతో మరణించాడు. దీంతో ఇద్దరు ఆడపిల్లలను, ఒక కుమారుడి పోషణ బాధ్యతలు ఆ ఇంటి ఇల్లాలిపై పడ్డాయి. ఆమె కాయకష్టం చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బులతో పెద్ద కుమార్తె వివాహం చేసింది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసిన రెండో కుమార్తె కష్టపడి చదివి సచివాలయంలో ఉద్యోగం సంపాదించింది. ఇలా సాగుతున్న ఈ మధ్యతరగతి కుటుంబపై విధి కన్నెర్ర చేసింది. ఎంతో సంతోషంతో ఉదయం నిద్ర లేచిన తల్లికుమార్తెలు.. సాయంత్రానికి శవాలుగా మారిపోయారు. ఈ ఘోరమైన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం గురిజాల గ్రామానికి చెందిన ఎం. రమణమ్మ(52), గోపాల్ రెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే 12 ఏళ్ల కిందటే గోపాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఇక అప్పటి నుంచి రమణమ్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. వ్యవసాయం చేస్తూ వచ్చిన ఆదాయంలో పిల్లలను చదివించింది. అదే వ్యవసాయపు పనులు చేసుకుంటా వచ్చిన ఆదాయంతో పెద్ద కుమార్తెకు వివాహం చేసింది. అనంతరం చిన్న కుమార్తె శ్యామ(28)ల, కుమారుడు భవనేశ్వర్ రెడ్డితో కలిసి రమణమ్మ నివసిస్తోంది.
కుటుంబ ఆర్థిక పరిస్థితి అర్ధం చేసుకున్న శ్యామల కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని భావించింది. అలానే కష్టపడి చదివి సచివాలయం ఉద్యోగం సంపాదించింది. సింహాద్రిపురంలోని సచివాలయం-1లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. శ్యామల విధులు నిర్వహిస్తూనే సాయంత్రం సమయంలో తల్లికి వ్యవసాయ పనులో సాయం చేస్తుండేది. అదే విధంగా బుధవారం కూడ శ్యామల విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చింది. అనంతరం తల్లితో కలిసి దుస్తులు శుభ్రం చేయడానికి తమ పొలం సమీపంలో ఉన్న పీబీసీ కాలువ వద్దకు వెళ్లారు.
కాలువ గట్టుపై నిల్చుని బట్టలు శుభ్రంగా చేస్తుండగా రమణమ్మ కాలుజారి నీటిలో పడిపోయింది. తల్లి నీటిలో పడిపోవడం గమనించిన శ్యామల కాపాడేందుకు తాను కాలువలోకి దిగింది. కాలువలో పూడిక ఎక్కవగా ఉండటంలో ఇద్దరు అందులో చిక్కుకుపోయారు. చివరకు ఊపిరాడ తల్లి కుమార్తె ఇద్దరూ మృతి చెందారు. చాలా సమయంలో తరువాత నీటిపై తేలుతున్న వారి మృతదేహాలను వెంకటాపల్లెకు వెళ్తున్న కొందరు గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందిచడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను కాలువలో నుంచి వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతి అర్థాంతరం కన్నుమూసింది. వారిద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 12 ఏళ్ల క్రితం భర్త మరణంతో గట్టి ఎదురు దెబ్బ తగిలిన తట్టుకుని పిల్లలను పెంచి పెద్ద చేసిన ఆ తల్లి, కుటుంబకు ఆర్థికంగా తోడు ఉంటున్న ఆ కుమార్తెపై విధి కన్నెర్ర చేసింది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.