పల్నాడు జిల్లా ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రెండు పెద్ద పులులు సంచరిస్తున్నాయనే వార్త వారికి నిద్ర లేకుండా చేస్తోంది.
పల్నాడు జిల్లా వాసులు భయం గుప్పిట్లో బతుకుతన్నారు. ఎప్పుడు ఎటు నుంచి పెద్దపులి దాడ చేస్తుందో అని భయపడుతున్నారు. దుర్గి మండలంలో ఫారెస్ట్ అధికారులు పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. శ్రీశైలం- సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 73 పులులు ఉండగా.. రెండు పులులు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చి సంచరిస్తున్నట్లు వెల్లడించారు. బొల్లాపల్లి- కారంపూడి మండలాల అటవీ ప్రాంతానికి పులులు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
అటవీ అధికారులు హెచ్చరించిన విధంగానే బొల్లాపల్లి మండలం జంగమేశ్వరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు అక్కడి స్థానికులు వెల్లడించారు. అంతేకాకుండా జంగమేశ్వరం గ్రామంలో ఇద్దరు వ్యక్తులపై పెద్దపులి దాడి చేసినట్లుగా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి దూరంగా ఉండి ఆ వీడియో తీశాడు. ఆ దృశ్యాల్లో ఒక పులి ఇద్దరి వ్యక్తులపై దాడి చేసింది. ఒకరిని పక్కకు నెటట్టేసి.. మరొకరిపైకి దూకింది. వారిని కూడా కాళ్లతో రక్కినట్లుగా చేసి కంగారుగా పరిగెత్తింది. ఆ పులుల మ్యాన్ ఈటర్స్ కావని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
వాళ్లు చెప్పిన విధంగానే ఆ పులి వారిపై దాడి చేయాలి అనుకున్నట్లుగా కనిపించలేదు. అది భయపడుతూ.. ఆ భయంలోనే వారిని నెట్టేసి అక్కడి నుంచి పారిపోయింది. ఆ దాడి ఎవరిపై జరిగింది? వాళ్ల వివరాలేంటి? అసలు అది నిజంగానే పల్నాడు జిల్లాలో జరిగిందా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, ముఖ్యంగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదని, కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని తెలిపారు.
disclaimer: Graphic Or Shocking Visuals#పల్నాడుజిల్లా #బొల్లాపల్లిమండలం #జంగమేశ్వరంగ్రామం #పులిసంచారం pic.twitter.com/4qB4GgUZUX
— Tirumalasetty Tirupathirao (@tiru9676) May 7, 2023