ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 07వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతుండడంతో అందరి దృష్టి టీడీపీపై నెలకొంది. తన సతీమణిని అసెంబ్లీలో దూషించడంతో భోరున విలపించడమే కాకుండా తిరిగి సీఎంగానే సభకు వస్తానని, అప్పటివరకు సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా? అనే దానిపై టీడీపీలో సందిగ్దత నెలకొంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
మొదట పొలిట్బ్యూరో సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ను వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా… ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మాత్రం సభకు వెళ్లేందుకే మొగ్గు చూపారు సభ్యులు… అయితే, చంద్రబాబు మాత్రం సభకు హాజరు కావడంలేదు.. చంద్రబాబు మినహా.. అసెంబ్లీకి వెళ్లనున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున సమస్యలు, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న క్రమంలో బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సభలోనే సీఎం వైఎస్ జగన్ను నిలదీయాలని టీడీపీ సభ్యులు అభిప్రాయడడంతో.. సభకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. మరి బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ అధికార పక్షాన్ని ఏ రకంగా నిలదీయనుందో.. ప్రతిపక్షాలను అధికార పక్షం ఎలా ఎదుర్కొనుందో తెలియాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.