సినిమా పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వెళ్లిన అనేక మంది నటీనటులు తమ సత్తాను చాటారు.. చాటుతూనే ఉన్నారు. ఇక తెలుగు పరిశ్రమ గురించి చెప్పనక్కర్లేదు. సినీ దిగ్గజం నందమూరి తారకరామారావు.. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయమే పెను సంచలనమైతే..ఏకంగా ఓ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, కొన్ని నెల్లలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అలాగే చాలా మంది నటులు.. రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు మరో నటుడు..
సినిమా పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వెళ్లిన అనేక మంది నటీనటులు తమ సత్తాను చాటారు.. చాటుతూనే ఉన్నారు. ఇక తెలుగు పరిశ్రమ గురించి చెప్పనక్కర్లేదు. సినీ దిగ్గజం నందమూరి తారకరామారావు.. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయమే పెను సంచలనమైతే..ఏకంగా ఓ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, కొన్ని నెల్లలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సినిమా రంగానికే కాదూ.. రాజకీయానికి రంగులదిద్దిన ధీశాలి. ఆ తర్వాత కూడా చాలా మంది నటీనటులు సినీ పరిశ్రమ నుండి వచ్చి.. ప్రజా సేవలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో నటి రోజా మంత్రి పదవిలో కొనసాగుతుండగా.. మార్గాని భరత్ ఎంపీగా ఉన్నారు. నటులు.. రాజకీయాల్లోకి రావడం ఇక్కడ కొత్తేమీ కాదు.
రాజకీయానికి, వెండితెరకు సంబంధాలు బలంగా ఉంటాయి. కొందరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే.. మరికొందరు పరోక్షంగా సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు మరో నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త గట్టిగా హల్ చల్ చేస్తోంది. ఆ.. ఆ.. అబ్బా.. అట్నా, అక్కా అంటూ మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సప్తగిరి తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించినట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సప్తగిరి.. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంటే తనకెంతో ఇష్టమని.. త్వరలో ఆ పార్టీలో చేరతానంటూ వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా తెలిపి.. అందర్నీ ఆశ్చర్యపోయారు.
పేదలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నాన్న ఆయన.. టీడీపి అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ కానీ, పార్లమెంట్ స్థానానికి గానీ పోటీ చేస్తానని, లోకేష్ తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉందని అన్నారు. తన సొంతూరు చిత్తూరు అని, ఐరాల ఆస్పత్రిలోనే పుట్టానని, అందుకే ఈ జిల్లా నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్ విషయంలో లోకేష్ హామీ ఇచ్చారని, అయితే ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయమంటే.. అక్కడి నుండి బరిలోకి దిగుతానన్నారు. తదుపరి అధికారంలోకి వచ్చేదీ టీడీపీ ప్రభుత్వమేనన్నారు.