ప్రపంచంలో అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తుంటారు. ఇక భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఎపటికప్పుడు టీటీడీ దేవస్థాన అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. అలానే తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో సరికొత్త కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది.
ప్రపంచంలో అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తుంటారు. ఇక భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు టీటీడీ దేవస్థానం అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. అలానే తిరుమలతో పాటు చుట్టు ఉన్న పరిసర ప్రాంతాల్లోని పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంది. అందుకే కొండపైకి ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ప్రస్తుతం టీటీడీ ఉద్యోగులు చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల అనే సామూహిక పరిశుభ్రత కార్యక్రమం కొనసాగుతోంది.
తిరుమలో టీటీడీ ఉద్యోగులు చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది. దీంతో తిరుమలను పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఓ సరికొత్త కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టుంది. ఈ నెల 13 సామూహిక శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని సేవాసదన్-2లో ఈవో సామావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో పాటు టీటీడీలోని అన్ని విభాగాధిపతులు, కాలేజీల ప్రిన్సిపల్స్, మెడికల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
ఇక టీటీడీ ఉద్యోగులు చేపట్టిన సామూహిక కార్యక్రమంలో ఈవో ప్రశంసించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పారిశుద్ధ్య నిర్వాహణలో స్ఫూర్తిదాయకంగా పని చేసిన ఉద్యోగులందకి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో తిరుమలలోని ఘాట్రోడ్లు, నడక మార్గాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అందరు సన్నద్ధం కావాలని ఈవో పిలుపునిచ్చారు. “మే 13న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు మనమందరం 4 గంటల పాటు సాగే సామూహిక శ్రమదానంలో పాల్గొనాాలి. రెండు ఘాట్లలో దాదాపు 500, ఫుట్పాత్ రూట్లలో దాదాపు 1000 మంది ఉద్యోగులు ఆ రోజు సేవలు అందిస్తారు’ అన్నారు.
దేశ వ్యాప్తంగా ఈ శ్రమదాన యజ్ఞానికి విశేష ఆదరణ లభించడం జరిగింది. అలానే టీటీడీనే అందరికి ఆదర్శంగా మారడంతో ప్రతి నెల ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తిరుమల పరిసరాలను శుభ్రపరిచే అవకాశం తమకు కల్పించాలని అడుగుతున్న భక్తుల్లో కూడా శుద్ధ తిరుమల ఉద్యమం స్ఫూర్తిని నింపిందని ఈవో అన్నారు. మరి.. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.