ఉదయాన్నే విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యను విధులకు తీసుకొచ్చిన ఓ భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. కళ్లముందే భర్త మరణించడంతో ఆమె రోధనలు ఆపేందుకు ఎవ్వరి తరమూ లేదు.
ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. మహిళా కండక్టర్ భర్త మీదికి దూసుకెళ్లింది. భార్యను విధుల నిమిత్తం డిపోకు తీసుకొచ్చిన భర్త తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చేటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా, కావలి ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. ఆ వివరాలు..
సుభాషిణి అనే మహిళ కావలి బస్సు డిపోలో కండక్టర్ గా పనిచేస్తుంది. ఎప్పటిలానే ఇవాళ ఉదయం ఆమెను డిపో వద్ద దించడానికి వచ్చిన భర్త సుబ్బారాయుడు, ఆమెను డిపో గ్యారేజీలో వదిలి తిరిగి బైకుపై వెళ్తున్నాడు. అదే సమయంలో ఒంగోలు నుంచి కావలి వెళ్ళడానికి గ్యారేజీ నుంచి బయటకు వెళ్తున్న ఓ బస్సు అతనిపైకి దూసుకెళ్లింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగిపోయిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో డిపోలో విషాద చాయలు అలుముకున్నాయి. కళ్లముందే భర్త మరణించడంతో ఆమె రోధనలు ఆపేందుకు ఎవ్వరి తరమూ లేదు. ప్రమాదానికి కారణమైన బస్సు AP 26 TE 7388గా గుర్తించారు. బస్సు డ్రైవర్ అక్కడినుండి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు – కావలి ఆర్టీసీ డిపోలో దారుణం.. ఆర్టీసీ కండక్టర్ భర్తపై దూసుకెళ్లిన బస్సు
కండక్టర్ భర్త సుబ్బారాయుడును తన భార్యను గ్యారేజీలో వదిలి బైకుపై వెళ్తుండగా తొక్కించేసిన ఆర్టీసీ డ్రైవర్.. అక్కడికక్కడే మృతి చెందిన సుబ్బారాయుడు
ఆర్టీసీ డ్రైవర్ పరారీ pic.twitter.com/bgK0YYv5ci
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2023