వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అనేక మందిని బలితీసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న సిబీఐటీ కాలేజీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో మైనర్లతో సహా నలుగురు చనిపోయిన సంగతి విదితమే. నిన్నటికి నిన్న ఎల్బీనగర్ వద్ద కారు డోరు తీయడంతో.. బైకు తగిలి రెండేళ్ల చిన్నారి మృత్యువాత పడిన సంగతి విదితమే. తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రక్తమోడుతున్నాయి. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అనేక మందిని బలితీసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న సిబీఐటీ కాలేజీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో మైనర్లతో సహా నలుగురు చనిపోయిన సంగతి విదితమే. నిన్నటికి నిన్న ఎల్బీనగర్ వద్ద కారు డోరు తీయడంతో.. దానికి బైకు గుద్దుకుని రెండేళ్ల చిన్నారి మృత్యువాత పడిన సంగతి విదితమే. తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఎన్ని రోడ్డు భద్రత చర్యలు తీసుకున్నా, భద్రతా వారోత్సవాల పేరిట అవగాహన సదస్సులు నిర్వహించినా.. ఈ ప్రమాదాలు ఆగడం లేదు. నిర్లక్ష్యం, నిద్ర లేమి, వేగం, తప్పతాగి వాహనం నడపటం వంటి వాటి కారణంగా ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఘోర విషాదం నెలకొంది.
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరులో శనివారం తెల్లవారు జామున దారుణ సంఘటన చోటుచేసుకుంది. పీలేరులోని ఎంజేఆర్ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల నుండి తిరుమణ్ణమలైకు 11 మందితో వెళుతున్న తుఫాను వాహనం.. లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పెను ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.