ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు ఎలక్ట్రికల్ కంట్రోల్ కమిషన్ బుధవారం ప్రకటన చేసింది. ఈ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి వస్తాయని ఈఆర్సీ వెల్లడించింది. ఈ మేరకు యూనిట్ కు ఎంత రేటు పెరగనుందనే విషయాన్ని ప్రకటించారు. 30 యూనిట్లకు 45 పైసలు, 31-75 యూనిట్ల వరకు 95 పైసలు, 76-125 యూనిట్ల వరకు రూ.1.40, 126 యూనిట్ల నుంచి 225 వరకు రూ.1.57, 226-400 మధ్య యూనిట్ కు రూ.1.16 ఆపై వినియోగానికి యూనిట్ కు 55 పైసలు పెంచనున్నట్లు తెలియజేశారు.
ఇదీ చదవండి: AP కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.. ఎప్పుడంటే!
పెరిగిన ధరల ప్రకారం.. 30 యూనిట్ల విద్యుత్ వాడితే యూనిట్ కు 1 రూపాయి 45 పైసలు కడితే.. ఇకపై రూ.1.90 చెల్లించాల్సి ఉంటుంది. 31 నుంచి 75 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే.. ప్రస్తుతం యూనిట్ కు 2 రూపాయల 09 పైసలు చెల్లిస్తే.. కొత్త ధరల ప్రకారం ఆగస్టు నుంచి 3 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 76 నుంచి 125 యూనిట్ల స్లాబ్ వారు.. ప్రస్తుతం యూనిట్ కు 3 రూపాయల 10 పైసలు చెల్లిస్తే.. ఆగస్టు నుంచి రూ.4.50 కట్టాలి. 126- 225 యూనిట్లు వాడిన వారు ఇప్పటివరకు రూ.4.43 చెల్లిస్తే.. ఆగస్టు నుంచి రూ.6 చెల్లించాలి. 226-400 యూనిట్లు వాడితే ప్రస్తుతం రూ.7.59 చెల్లిస్తున్నారు. కొత్త ధరల ప్రకారం రూ.8.75 కట్టాలి. 400 యూనిట్లు పైన వినియోగించే వారు ప్రస్తుతం రూ.9.20 చెల్లిస్తుండగా.. ఆగస్టు నుంచి రూ.9.75 చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన విద్యుత్ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.