ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు ఎలక్ట్రికల్ కంట్రోల్ కమిషన్ బుధవారం ప్రకటన చేసింది. ఈ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి వస్తాయని ఈఆర్సీ వెల్లడించింది. ఈ మేరకు యూనిట్ కు ఎంత రేటు పెరగనుందనే విషయాన్ని ప్రకటించారు. 30 యూనిట్లకు 45 పైసలు, 31-75 యూనిట్ల వరకు 95 పైసలు, 76-125 యూనిట్ల వరకు రూ.1.40, 126 యూనిట్ల నుంచి 225 వరకు రూ.1.57, 226-400 మధ్య యూనిట్ […]
టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రజారవాణా సంస్థ టీఎస్ఆర్టీసీపై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడింది. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోంది. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గతంలో వ్యాఖ్యానించారు. ఇవాళ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై […]