కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా.. త్వరలో ప్రారంభించనున్న వందే భారత్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వందే భారత్ రైలుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద ప్రారంభం కానున్న వందే భారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రయాణించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రైలు బుధవారం చెన్నై నుంచి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి విశాఖకు చేరుకుంది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వందే భారత్ రైలు పైకి రాళ్లు విసిరారు. దాంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి విశాఖకు చేరుకుంది రైలు. రైలు పరిశీలించిన సంబంధిత అధికారులు రైలు మెయింటెనెన్స్ నిమిత్తం వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి న్యూ కోచింగ్ కాంప్లెక్స్ కు బయలుదేరింది. ఈ క్రమంలోనే అక్కడ రైలు నిలపడానికి ఖాళీ లేకపోవడంతో.. సిగ్నల్ వచ్చే వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను రాంమ్మూర్తి పంతులు గేటు దగ్గర నిలిపివేశారు. ఈ క్రమంలోనే సాయంత్రం ఆరు గంటల సమయంలో కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు భోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
Andhra Pradesh | Stones pelted on Vande Bharat train in Visakhapatnam which will be flagged off by PM Modi on Jan 19. Incident occurred during maintenance.
Glass pane of a coach of Vande Bharat express was damaged near Kancharapalem, Visakhapatnam. Further probe underway: DRM pic.twitter.com/JQLrHbwyJ4
— ANI (@ANI) January 11, 2023
ఈ క్రమంలోనే ప్రధాని త్వరలో ప్రారంభించే రైలు పై దాడి జరగడంతో.. పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. రైల్వే పోలీసులతో పాటుగా దర్యాప్తు చేపట్టారు స్థానిక పోలీసులు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ముగ్గురు నిందితులను 24 గంటలు గడవక ముందే అరెస్ట్ చేశారు. నిందితులు చందు, దిలీప్, శంకర్ అనే వ్యక్తులే దాడికి పాల్పడ్డట్లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. అయితే మద్యం మత్తులో ఉండే అలా రాళ్ల దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పగిలిన అద్దాల స్థానంలో కొత్త అద్దాలను రైల్వే అధికారులు అమర్చారు.