పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం.. అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే.. భీమ్లా నాయక్ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదనే సంగతి తెలిసిందే.
భీమ్లా నాయక్ విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. ఇక భీమ్లా నాయక్ రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో నిరసన చేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఓ థియేటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేక నినాదాలు చేస్తూ, వైఎస్సార్సీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కారణంగా మంత్రులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు గుడివాడలోనే భీమ్లా నాయక్ సినిమా చూసినట్లు సమాచారం. ఇక సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ రెట్టింపు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రాన్ని సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#PawanKalyan fans and #Janasena activists today blocked AP ministers #KodaliNani and #PerniNani, who visited for an inauguration of a theatre in #GUDIVADA, Krishna district. Chanting slogans against the state government, the fans protested against decision.#BheemlaNaayak pic.twitter.com/l7C6XPrcFb
— ur’sGirivsk (@girivsk) February 25, 2022