‘అల వైకుంఠపురములో` సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలపడంలో తమన్ అందించిన సంగీతం, పాటలు ప్రధాన పాత్ర పోషించాయన్నది జగమెరిగిన సత్యం. అల వైకుంఠపురములో, వకీల్ సాబ్ సినిమాల్లోని పాటలు సక్సెస్ కావడంతో తమన్ ఓ రేంజ్ కు చేరుకున్నారు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, తమ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పదేళ్లుగా వీరిద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ పైచేయి మాత్రం దేవిశ్రీప్రసాద్ ఇస్తూ వచ్చాడు. అయితే గత ఏడాది నుంచి సీన్ రివర్స్ అయింది. తమన్ లేకుండే త్రివిక్రమ్ సినిమా చేయలేనంతగా. కీరవాణి – రాజమౌళికే ఫిక్స్ అయ్యాడు. దేవీశ్రీ ప్రసాద్ ఫామ్ కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు. తమన్ మాత్రమే హవా చేస్తున్నాడు.
వరుసగా టాప్ హీరోస్ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ‘కిక్’ సినిమాతో సంగీత ప్రపంచంలో కొత్త సౌండింగ్ కి నాంది పలికిన తమన్ అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సంక్రాంతికి విడుదల కానున్న పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం కి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. ఇలా ఇద్దరు బడా హీరోలు పోటీ పడుతున్న రెండు సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
దీంతో తమన్ కు తమనే పోటీ అని అంతా అంటున్నారు. ఒకప్పుడు తమన్ ను వెనక్కి నెట్టిన దేవీ ఈ మధ్య తను వెనకబడిపోతున్నాడు. ఉప్పెన వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చినా తమన్ తో కంపేరిజనల్ లో వెనక బడ్డాడు అనేది నిజం. అందుకు ప్రధాన కారణం పెద్ద హీరోల సినిమాలకు ఈ ఇద్దరూ ఇచ్చిన సంగీతమే. తమన్ సినిమాలు పెద్ద హిట్ అవడం మరో రీజన్ గా ఇప్పుడు దేవీ కంటే తమన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.