వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. ఏకంగా సీబీఐ చీఫ్కు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. పరిటాల కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించే కుట్ర జరుగుతోందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో మాదిరిగానే నిందితులను హత్య చేసే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు.
ఇది కూడా చదవండి: నర్సాపురం ఉపఎన్నికలో షాకింగ్ ట్విస్ట్! జనసేనలోకి రఘురామ!
అలానే, వివేకా హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తేల్చాలని, వైసీపీలోని ఓ కీలక ఎంపీని విచారించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో సీబీఐ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వారం రోజులు టైమిస్తున్నాను.. ఈలోపు తేల్చండి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి