పది మందితో కలిసిమెలిసి జీవితం గడిపే వారు ఒక్కసారే ఒంటరైపోతే ఎంత నరకం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది మనుషులకే కాదు.. జంతువులకు అలాంటి బాదే ఉంటుంది. దారి తప్పి వెళ్లిందో.. దారి తెలియక వెళ్లిందో.. తెలియదు కానీ ఓ వానరం నడి సముద్రంలో వెళ్లి మూడు నెలల నుంచి బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసింది. దానికి తిరిగి వచ్చే దారి తెలియక.. మార్గం లేక అక్కడే జాలర్లు వేస్తున్న ఆహారం తింటూ బతికింది. మొత్తానికి ఆ వానరం బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంది.
కాకినాడ హార్బర్కు దాదాపు మూడు నాటికల్ మైళ్ల దూరంలో ఒక వానరం ఎలా వెళ్లిందో తెలియదు కానీ అక్కడే బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీసింది. ఆకలితో అలమటించే ఆ వానరానికి మత్స్యకారులు వెల్లినపుడు తాము తిన్న ఆహారంలో మిగిలింది వేస్తూ వచ్చారు. ఆ వానరం ఇంతకాలం సముద్రంలో కెరటాలను అదుపులో ఉంచేందుకు ఏర్పాటు చేసిన కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల పై ఉంటూ వచ్చింది. ఆ వానరం పడే కష్టాలు చూసి మత్స్యకారులు ప్రకాశం జిల్లాలో ఉన్న జంతువులను రక్షించే సంస్థకు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు.
యానిమల్ రెస్క్యూ బృందం బోటు ద్వారా ఆ వానరం ఉన్న ప్రదేశానికి చేరుకొని మూడు రోజుల పాటు ఎంతో ఓపికగా వానరం దగ్గర ఉండి శనివారం అతికష్టం మీద వానరాన్ని బోనులో బంధించి ఒడ్డుకు చేర్చారు. ఆ వానరాన్ని కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి కార్యాలయానికి తరలించి దట్టమైన చెట్ల పొదల్లో విడిచిపెట్టారు. ఒక్కసారే స్వేచ్చ రావడంతో వానరం బతుకు జీవుడా అనుకుంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి చెట్టు ఎక్కి కూర్చుంది వానరం. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.