దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామి వారి పేరునే తల్చుకుంటున్నారు. సాధారణంగా వానరాలు ఇంట్లో ప్రవేశిస్తే గోల గోల చేస్తాయి. వాటికి భయపడి ఇంట్లో నుంచి బయటకు పారిపోయే పరిస్థితి నెలకొంటుంది. కానీ.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ వానరం ఇంట్లోకి ప్రవేశించి స్వామి వారి కల్యాణం అయ్యేంతవరకూ అక్కడే ఉండి.. అందరితో కలిసి భజన కూడా చేసింది.
ఇది చూసి సాక్షాత్తు ఆంజనేయస్వామివారే వచ్చి కళ్యాణం తిలకించారని పలువురు భక్తులు భావిస్తున్నారు. ఇంట్లో ప్రవేశించిన వానరం ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు.. పైగా స్వామి వారికి కళ్యాణం అయ్యేంత వరక శ్రద్దగా తిలకిస్తూ ఉంది. ఇక శ్రీరామనవమి రోజు ఈఘటన జరగటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.