శం మొత్తం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంతోషంలో మునిగిపోయారు.. కానీ విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా విజయనగరంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ అనే క్రీడాకారుడు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..
నూతన సంవత్సరం సందర్భంగా విజయనగరం జిల్లా వెంపడం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది క్రీడాకారులు వచ్చారు. ఈ సందర్భంగా ఎరుకొండ-కొవ్వాడ జట్ల క్రీడాకారులు తలపడ్డారు. ఆ సమయంలో ఎరుకొండ గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు కిందపడిపోవడంతో తలకు తీవ్రంగా గాయం అయ్యింది. వెంటనే నిర్వాహకులు రమణను విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమణ కన్నుమూశాడు.
రమణ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చేతికి అందివచ్చిన కొడుకు అకస్మాత్తుగా కన్నుమూయడంతో రమణ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రమణ మరణ వార్త తెలిసిన ఎరుకొండ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.