గ్రామంలో గ్రామస్తులంతా కలిసి లాక్ డౌన్ విధించారు. ఊర్లోకి ఎవరూ రాకుండా అన్ని దారుల్లో ముళ్ల కంచెలు వేసి వచ్చే వారిని రాకుండా అడ్డుకున్నారు. అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, దీనికి ముందు జాగ్రత్తతో గ్రామస్తులు ఇలా లాక్ డౌన్ పెట్టారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవును.. మీరు విన్నది నిజమే. ఇక కారోనా కాకుండా దేనికి మరీ లాక్ డౌన్ అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.
అది శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామం. ఊళ్లోని జనాలంత తమ పని తాము చేసుకుంటూ సంతోషమైన జీవితాలను గడుపుతున్నారు. అయితే ఉన్నట్టుండి గత మూడు నెలల్లో ఆ గ్రామంలో ఐదు మంది వ్యక్తులు చనిపోయారట. అయితే వీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించటం విశేషం. దీంతో గ్రామంలోని పెద్దలంతా కలిసి వీరి మరణాలపై చర్చించుకుని మన గ్రామానికి ఏదో తెలియని కీడు జరుగుతుందని భావించారు. కీడు నిర్మూలన కోసం ఓ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్తులు.
ఇది కూడా చదవండి: కోడిపుంజుతో సరికొత్త నాటకం.. భర్తను హత్య చేసి పాతిపెట్టిన భార్య!
ఒడిస్సా, విజయనగరం ప్రాంతాలకు చెందిన కొందరు మంత్రికులు అని చెప్పుకునే వ్యక్తులను పిలిపించుకున్నారు. అయితే వీరు వచ్చి గ్రామంలో ఏదో కీడు జరుగుతుందని, క్షుద్రపూజలు చేయాలని చెప్పినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 17 నుంచి 25 వరకు గ్రామంలోకి ఎవరూ రాకుండా లౌక్ డౌన్ విధించి రాత్రిపూట పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక గ్రామంలోకి అయిదుగురు హిజ్రాలను తీసుకొచ్చి రాత్రిళ్లు పూజలు చేయిస్తున్నారని, గ్రామంలోని ప్రజలు ఇతర ఇతర గ్రామాలకు వెళ్లకుండా కంచెలు వేసుకున్నారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసుల ఆ గ్రామాంలోకి చేరుకుని ఆ కంచెలను తొలగించి కౌన్స్ లింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.