Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని 3.5 లక్షల మంది విద్యార్థులకు త్వరలో ఇంటర్న్షిప్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం లింక్డ్ఇన్ సౌజన్యముతో ఈ ఇంటర్న్షిప్ చేపడుతోంది. అక్టోబర్ 1నుంచి ఈ ఇంటర్న్షిప్ ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ కే హేమచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మండలి కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఐటీ సలహాదారుడు శ్రీనాథ్ దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింక్డ్ ఇన్ వల్ల కలిగే లాభాలను చర్చించారు. మండలి అభివృద్ధి చేసిన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి వివరించారు.
దాదాపు 9 లక్షల మంది దాకా విద్యార్థులు ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఇకపై ఈ ప్లాట్ఫామ్ ద్వారానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం లింక్డ్ ఇన్ ఇండియా హెడ్ సబాకరీం మాట్లాడారు. ఏపీలోని విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు పెంచడానికి లింక్డ్ ఇన్ సహాయ పడుతుందని అన్నారు. అంతేకాక! యజమానులను ఆకర్షించడానికి కూడా లింక్డ్ ఇన్ ఉపయోగపడుతుందని చెప్పారు. లింక్డ్ ఇన్ లెర్నింగ్ సొల్యూషన్ ద్వారా ప్రతివారం 60 కోర్సులను విద్యార్థులు నేర్చుకుంటున్నారని లింక్డ్ ఇన్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ తెలిపారు.