ఆంధ్రప్రదేశ్లోని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది. గత ఎన్నికల హమీల్లో భాగంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఇప్పటికే అర్హులైన వారందరికీ అందిస్తూ.. ఆర్థిక చేయూతను ఇస్తుంది
ఆంధ్రప్రదేశ్లోని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది. గత ఎన్నికల హమీల్లో భాగంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఇప్పటికే అర్హులైన వారందరికీ అందిస్తూ.. ఆర్థిక చేయూతను ఇస్తుంది. పేద పిల్లలను విద్య నుండి దూరం చేయకూడదన్నఉద్దేశంతో అమ్మఒడి అనే పథకాన్ని తీసుకు వచ్చారు ముఖ్యమంత్రి జగన్. కుల, మత, వర్గం బేధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాల్గవ ఏడాది కూడా అమ్మఒడిని లబ్దిదారులకు అందిస్తున్నారు.
గత నెల 28న జగన్ అమ్మఒడి కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు.పేద విద్యార్థులను చదువులకు దూరం చేయకూడదన్న సదుద్దేశంతో రూ. 15వేలు ఇస్తుంది ప్రభుత్వం. స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ కింద రూ. 2000 వేలు తగ్గించి రూ. 13 వేలను జమ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం 15 రోజుల పాటు సాగుతుందని చెబుతున్నా.. కొంత మంది ఇంకా తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని గగ్గోలు పెడుతున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం.. ఈ కెవైసీ పూర్తి అయ్యి, అర్హత ఉన్న వారికి జులై 7వ తేదీల్లోగా ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని పేర్కొంది. ఇప్పటికే చాలా మంది ఖాతాల్లోకి వచ్చాయని, అర్హులైన వారందరికీ అందుతాయని తెలిపింది.