ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇటీవల సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ పలు వ్యూహాలతో ముందుకు సాగుతుంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు సైతం నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు అందించారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ వరుస గా శుభవార్తలు చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు అందించారు సీఎం జగన్. ఉద్యోగులకు స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ పేకి సంబంధించి 11వ సిఫార్సులు యధాతథంగా అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీ.ఓ.ఎంఎస్. 79 ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో 1, 2 కేటగిరీలు మినహా అన్ని కేటగిరి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులకు స్పెషల్ పే కింద 30 నుంచి 33 శాతం వరకు పెరుగుదలకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇప్పటి వరకు సీఎం జగన్ ఉద్యోగులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ వస్తున్నారు.. ఈ క్రమంలోనే ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిలో చర్చల్లో ఇచ్చిన హామీని జగన్ సర్కార్ నిలబెట్టుకుంది. గతంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పలు డిమాండ్స్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చారని.. స్పెషల్ పే పెంచినందుకు ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి, ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు.